కరోనా వైరస్ కారణంగా అయ్యప్ప భక్తుల అనుమతిపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ... కేవలం వ్యాక్సిన్ డోస్ వేయించుకున్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. అది కూడా ఆన్ లైన్ ద్వారా ముందుగా టైమ్ స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే. ఇక వార్షిక మండలం - మకరవిళక్కు సీజన్ కోసం రెండు రోజుల క్రితమే అయ్యప్ప ఆలయాన్ని అధికారులు తెరిచారు. భారీ వర్షాల కారణంగా పంబ డ్యామ్ వరద నీరు పోటెత్తింది. దీంతో డ్యామ్ దిగువ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. డ్యామ్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు కక్కి - అనాతోడ్ రిజర్వాయర్ వద్దకూడా రెడ్ అలర్ట్ నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం నుంచి అయ్యప్ప దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు వెల్లడించారు.
కరోనా వైరస్ కారణంగా అయ్యప్ప భక్తుల అనుమతిపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ... కేవలం వ్యాక్సిన్ డోస్ వేయించుకున్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. అది కూడా ఆన్ లైన్ ద్వారా ముందుగా టైమ్ స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే. ఇక వార్షిక మండలం - మకరవిళక్కు సీజన్ కోసం రెండు రోజుల క్రితమే అయ్యప్ప ఆలయాన్ని అధికారులు తెరిచారు. భారీ వర్షాల కారణంగా పంబ డ్యామ్ వరద నీరు పోటెత్తింది. దీంతో డ్యామ్ దిగువ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. డ్యామ్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు కక్కి - అనాతోడ్ రిజర్వాయర్ వద్దకూడా రెడ్ అలర్ట్ నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం నుంచి అయ్యప్ప దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు వెల్లడించారు.