* మే 13న జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు  

* విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి భరత్ పైనే అందరూ చూపులు

* కాంట్రవర్సీ క్వీన్ అతని పేరు ఎత్తడంతో అందరూ షాక్

(ఆంధ్రప్రదేశ్-ఇండియా హెరాల్డ్)

పూనమ్ కౌర్ అంటే తెలియని తెలుగు సినీ అభిమానులు ఉండరు. పూనమ్ సోషల్ మీడియాలో తరచుగా తన బోల్డ్ స్టేట్‌మెంట్‌లతో అందరికీ షాక్స్ ఇస్తూ ఉంటుంది. ఇటీవల టీడీపీ విశాఖపట్నం ఎంపీ, గీతం యూనివర్సిటీ ఛైర్మన్ మతుకుమిల్లి భరత్ గురించి ఆమె చేసిన కామెంట్స్ హైలెట్ అయ్యాయి. పూనమ్ వెండితెరపై అలరించిన నటి మాత్రమే కాదు, మోడల్ కూడా. ఆమె తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటించి ఆకట్టుకుంది. ఆమె నటన నుంచి ఒక అడుగు వెనక్కి వేసిందేమో కానీ పాలిటిక్స్ పై కామెంట్ చేయకుండా ఉండటం లేదు,

ఆమె ముఖ్యంగా నటుడు పవన్ కళ్యాణ్‌పై విమర్శనాత్మక కామెంట్ చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. ఇటీవల, ఆమె తన దృష్టిని నటుడు నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్‌పై పడింది. అతని గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనాన్ని రేకెత్తించాయి. ఎప్పుడూ వార్తల్లో నిలిచే పూనమ్ ఇటీవల 'గుంటూరు కారం' చిత్రంపై తన ఆలోచనలను పంచుకుంది. అలానే ఆంధ్రప్రదేశ్ (AP) రాజకీయ దృశ్యంపై వ్యాఖ్యానిస్తూనే ఉంది. ఆమె ఒక ట్వీట్‌లో ఏపీని ఉత్తరప్రదేశ్‌తో పోల్చింది, అది త్వరగా వైరల్ అయ్యింది, దాని తర్వాత మరొక పోస్ట్ చాలా సంచలనం కలిగించింది.

ప్రత్యేకంగా, ఆమె భరత్ గురించి ట్వీట్ చేసింది, ఏపీ రాజకీయాల్లో అతని క్రియాశీల పాత్రను హైలైట్ చేసింది.  భరత్ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నుంచి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నారు. పూనమ్ తన మద్దతును వ్యక్తం చేసింది, అతని విజయం ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంది, ముఖ్యంగా చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు కోసం అతనికి ఓటు వేయాలంటూ విశాఖపట్నం వాసులను కోరింది.

 ఈ కామెంట్లు చేయడానికి కారణం తనకు భరత్ డబ్బులు ఇచ్చాడేమో అని జనాలు అనుకుంటారని కానీ అది నిజం కాదని ఆమె తెలిపింది. భరత్ కు ప్రజల మద్దతు కావాలని కోరింది. కాంట్రవర్సీ క్వీన్ భరత్ గురించి మాట్లాడటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె చేసిన ట్వీట్ అప్పటి నుంచి ఆన్‌లైన్‌లో వైరల్ గా మారింది. అసలు భరత్ గురించి ఇప్పటికీ ఏపీ ప్రజలకే తెలియదు అలాంటిది పూనమ్‌ కౌర్‌కి ఎలా తెలిసింది? ప్రముఖులకు డబ్బులు ఇప్పించి ఇలా సంత డబ్బా కొట్టించుకుంటున్నారు అని చాలామంది విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: