
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ నుంచి బనకచర్ల ప్రతిపాదన రాలేదని, వస్తే అన్ని నిబంధనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ఉత్తమ్ వెల్లడించారు. తెలంగాణ నీటి హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని, అన్యాయం జరిగితే ఎంతవరకైనా పోరాడుతామని ఆయన ఉద్ఘాటించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు తెలంగాణ హక్కుల కోసం కేంద్రాన్ని ఒప్పించాలని ఆయన కోరారు. బనకచర్ల ప్రాజెక్టు కృష్ణా నది జలాల విభజనలో తెలంగాణకు నష్టం కలిగిస్తుందని, ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ పేర్కొన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా నది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందని ఉత్తమ్ ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు 724 టీఎంసీ నీటి వాటా ఉండగా, బీఆర్ఎస్ హయాంలో 1254 టీఎంసీ నీటిని ఆంధ్రప్రదేశ్కు తరలించారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు, 299 టీఎంసీ తెలంగాణకు సరిపోతుందని సంతకం చేసిందని, ఇది తెలంగాణకు మోసమని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 68 వేల కోట్ల అదనపు ఖర్చు వృథా చేయకుండా ఉంటే, కృష్ణా ప్రాజెక్టులు పూర్తయ్యేవని ఉత్తమ్ పేర్కొన్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు