అమరావతి మహిళల గురించి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్ల విషయంలో షర్మిల రియాక్ట్ కావడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. రాయచోటిలో మీడియాతో మాట్లాడిన షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలను కించపరుస్తూ సజ్జల ఒక మూర్ఖుడిలా మాట్లాడారని ఆమె అన్నారు. వైసీపీ చేసిన తప్పునే మళ్లీ చేస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. సజ్జల కొడుకు భార్గవ్ సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని నాపై దుష్ప్రచారం చేశాడని ఆమె తెలిపారు.
 
వైఎస్ కూతురు, ఒక మహిళ అని కూడా చూడకుండా కించపరిచారని షర్మిల వెల్లడించారు. జగన్ అందరినీ నా అక్కాచెల్లెళ్లు అని అంటారని కానీ ఆయన సొంత చెల్లికే మర్యాద లేదని ఆమె పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని మహిళలను ఏం గౌరవిస్తారని విమర్శలు చేయడం ఏంటని వెల్లడించడం హాట్ టాపిక్ అవుతోంది.
 
పార్టీలో కొంతమంది తీరు విషయంలో షర్మిల అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ మహా సముద్రమని ఈ పార్టీలో మంచితో పాటు చెత్త కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. పార్టీ అభివృద్ధి చెందుతుంటే కిందికి లాగేవాళ్లు సైతం ఉంటారని షర్మిల కామెంట్లు చేశారు. వాళ్లే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు సైతం చేస్తున్నారని షర్మిల అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
 
పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉందని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సొంత పార్టీపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని షర్మిల వెల్లడించారు. షర్మిల వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. షర్మిల ఏపీ రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. షర్మిల ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: