బయట ఎండలు ఎలా మండిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం . సడన్గా ఎండొస్తుంది ..ఆ తరువాత సడన్గా వర్షం పడిపోతుంది . వాతవరణం లో భారీ మార్పులు వచ్చేస్తున్నయ్. మరి ముఖ్యంగా తీవ్ర ఉక్కపోతకు తట్టుకోలేక ఇంట్లో 24 గంటలు ఏసి వాడేస్తూనే ఉంటున్నారు కొంతమంది జనాలు. మరీ ముఖ్యంగా చిన్న పిలల్లు ఉన్న వాళ్లు ముసలి వాళ్లు ఎక్కువుగా ఏసి ని వాడేస్తున్నారు.

దీనికి తగ్గటే ఇంట్లో మూడు రూమ్ లు ఉంటే మూడు రూమ్‌స్ లో ఏసి పెట్టుకుంటున్నారు. ఇలాంటి క్రమంలోనే ఎయిర్ కండిషనర్ పై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకురాబోతుంది. ఈ మధ్యకాలంలో ఎవరు చూసినా సరే ఇంట్లో ఏసి ని ఎక్కువగా వాడేస్తున్నారు. భారీగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల వేడికి తట్టుకోలేక ఈఎంఐలో ఏసీలు కొనుక్కొని చల్లగా సేదతీరాలి అని అనుకుంటున్నారు . ఈ క్రమంలోనే ఎయిర్ కండిషనర్ ల వాడకం ఎక్కువైపోయింది.  దీనిపై ప్రభుత్వం కొత్త రూల్ తీసుకురాబోతుంది. విద్యుత్ వినియోగాన్ని భారీగా తగ్గించే చర్యల్లో భాగంగా ఏసీ టెంపరేచర్ కు పరిమితి విధించబోతున్నట్లు తెలుస్తుంది .

కనిష్టంగా 20 డిగ్రీ సెల్సియస్ నుంచి గరిష్టంగా 28 డిగ్రీల మధ్య ఉండేలా నిబంధనలు సవరించబోతున్నట్లు  కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.  ఈ విషయాన్ని మనోహర్ లాల్ ఘట్టర్ ప్రకటించారు.  త్వరలోనే దీనిని అమలు చేస్తామని కూడా తెలియజేశారు.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏసీలలో కనిష్టంగా 16 డిగ్రీలు 18 దగ్గర టెంపరేచర్ లో ఉన్న ఎయిర్ కండిషనర్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి . కేంద్రం అమలు చేసిన నిర్ణయంతో ఇకపై అన్ని ఏసీలలో కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీ నుంచి ప్రారంభం కాబోతుంది . నిజానికి ఏసీలు 24 మధ్య వినియోగిస్తే చాలా విద్యుత్ ఆదా అవుతుంది అని నిపుణులు ఎప్పటినుంచో చెప్పుకొస్తున్నారు. ఇలా ఉపయోగిస్తే ఇక పై కరెంట్ ఎక్కువుగా ఆదా చేసిన్నట్లే..!




మరింత సమాచారం తెలుసుకోండి: