
కడప జిల్లాకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు సుదర్శన్ రెడ్డి చేసిన అవినీతి విషయంలో ప్రభుత్వం విచారణ జరపాలని విజయవాడకు చెందిన కంచి రాజేష్ అనే కాంట్రాక్టర్ కోరడం గమనార్హం. 2020 సంవత్సరంలో నాడు నేడు పనుల కోసం గ్రీన్ చాప్ బోర్డు అనే మెటీరియల్ ను సరఫరా చేయడం కోసం ఈ మేరకు సుదర్శన్ రెడ్డితో తాను ఎంఓయూ కుదుర్చుకున్నానని ఆయన చెబుతున్నారు.
దీని నిమిత్తం పలు దఫాలుగా కోటిన్నర రూపాయలు చెల్లించడం జరిగిందని కానీ మెటీరియల్ మాత్రం సరఫరా కాలేదని ఆయన చెబుతున్నారు. దీనికి బదులుగా నా డబ్బులు నాకు వెనక్కు ఇవ్వాలని కోరగా డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడటం జరుగుతోందని కంచి రాజేష్ వాపోయారు. రాష్ట్రంలో అధికారం మారిన నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి టీడీపీలో చేరడంతో తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన చెబుతున్నారు.
డబ్బుల గురించి అడిగితే సుదర్శన్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే సివిల్ ఫిర్యాదు అని కేసు తీసుకోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సుదర్శన్ రెడ్డి చేసిన మోసం విషయంలో టీడీపీ ముఖ్య నేతలు ఏ విధంగా వ్యవహరిస్తారనే చర్చ జరుగుతోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు