రాజకియ కుయుక్తులను రైతులు గ్రహించారు. కరేడు ఉద్యమానికి జరుగుతున్న అన్యాయాన్ని  గుర్తించారు. రైతులను చీల్చి, ఐకమత్యాన్ని దెబ్బతీసే కుట్రలను పసిగట్టారు. తమ ఉద్యమానికి ఊపిరి పోసేది రామచంద్రయాదవ్ ఒక్కడే అని ఏకగ్రీవ తీర్మానం చేశారు. తమ ఉద్యమానికి నేతృత్వం వహించాలని ఆయన్ని కోరారు. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగనీయబోమని ఆయనకు మాటిచ్చారు. అందుకు రామచంద్రయాదవ్ కూడా భావోద్వేగంతో స్పందించారు. కొత్త రూపం సంతరించుకోబోతున్న కరేడు ఉద్యమానికి భారతచైతన్య యువజన పార్టీ కార్యాలయం వేదికగా మారింది. బుధవారం విజయవాడ బిసివై పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత రామచంద్రయాదవ్ ను కరేడు రైతులు కలిశారు. ఈ సందర్భంగా రైతులను చూసిన రామచంద్రయాదవ్ భావోద్వేగానికి గురయ్యారు. కరేడు భూములను కుయుక్తులు పన్ని, రాజకీయాలు చేసి లాక్కుంటారనే బాధతోనే ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించానే తప్ప... మనస్పూర్తిగా కాదన్నారు. కరేడు గ్రామంతో, ప్రజలతో ఏదో తెలియని అనుబంధం ఏర్పడిందన్నారు. అలాంటి ప్రజలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితిల్లో ఉపేక్షించనన్నారు.


రాజకీయ కుట్రలను భగ్నం చేసి, కరేడు రైతుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించానన్నారు. రాజకీయ నాయకులు, అధికారులు ఎన్ని కుట్రలు చేసినా కరేడు భూములను తీసుకోలేరన్నారు. ముందు నాలుగు వేల ఎకరాలే సేకరిస్తామని కలెక్టర్ ప్రకటించారని దాని వెనుక కుట్ర దాగి ఉందన్నారు. రైతులను విడగొట్టి, ఐకమత్యాన్ని చెడగొట్టి భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రైతుల భూముల జోలికి వస్తే మరో నందిగ్రామ్ ఉద్యమం అవుతుందని హెచ్చరించారు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే కరేడులో పర్యటిస్తానన్నారు. ప్రాణం ఉన్నంత వరకు కరేడు రైతుల కోసం పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు మాట్లాడిన కరేడు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యమానికి రామచంద్రయాదవ్ మద్దతు ప్రకటించాకే అన్ని పార్టీలు తమ వద్దకు వచ్చాయన్నారు. రామచంద్రయాదవ్ లేకపోతే కరేడు రైతులకు న్యాయం జరగదని గ్రహించామన్నారు. ఊర్లో మహిళలు రామచంద్రయాదవ్ ను కరేడుకు తీసుకువస్తేనే గ్రామంలో అడుగుపెట్టమని చెప్పి పంపారని రైతులు భావోద్వేగానికి గురయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: