ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత , ఒకవైపు ప్రశంసలు, మరొకవైపు విమర్శలు కూడా ఎదుర్కొంటున్నట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కూటమిలో నేతల మధ్య సఖ్యత లేకపోవడం, ప్రభుత్వం కూడా కొన్ని పనులను చేయడం వల్ల, అలాగే ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం వల్ల ప్రజలలో కొంతమేరకు వ్యతిరేకత మొదలైందని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ టూర్ల తీరులో కూడా కొంతమేరకు వ్యతిరేకత కనిపిస్తున్నట్లు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం రెండోసారి సీఎంగా అయిన చంద్రబాబు ఎక్కువగా పర్యటనల మీదే దృష్టి పెట్టారు.



ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు 74 సార్లు పర్యటనలే చేసినట్లుగా వినిపిస్తున్నాయి. గడచిన శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు ఆదివారం రాత్రి వరకు మూడు కార్యక్రమాలకు హాజరయ్యారు. అనంతరం తిరిగి మళ్లీ ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరారు. సీఎంగా గెలిచినప్పటి నుంచి చంద్రబాబు తీరు ఇలాగే ఉన్నదని ప్రజలకు మాట్లాడుకుంటున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక  విమానంలో  హైదరాబాదుకు రాకపోకలు కొనసాగించడమే కాకుండా, వారంలో విశ్రాంతి, వినోదల, విందుకోసం ప్రత్యేకించి మరి విమానాలలో తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు ట్రోల్ చేస్తున్నారు.



ఇటీవలే అధికారిక పర్యటనలో భాగంగా గన్నవరం నుంచి దుబాయ్ కి వెళ్ళిన సీఎం చంద్రబాబు అక్కడి నుంచి మళ్లీ నేరుగా హైదరాబాద్ కి వెళ్లగా, అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ కి రావడం చంద్రబాబు 74వ సారని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. శనివారం రోజున రాత్రి పార్కు హయత్, ఆదివారం ఐటిసి కాకతీయ హోటల్, అలాగే అన్వయ కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమాలలో సైతం పాల్గొన్నారు. చంద్రబాబు ఎక్కువగా వీకెండ్ టూర్ లోనే ఉంటున్నారంటూ ప్రతిపక్ష నేతలు సోషల్ మీడియాలో   వైరల్ గా చేస్తున్నారు. 2014 -19 మధ్యలో కూడా ఇలానే చేశారని, 2019లో అధికారం కోల్పోయిన కూడా ఇలానే వ్యవహరించారని ,ముఖ్యంగా కరోనా కష్ట సమయాలలో 2022 వరకు ఏపీ ప్రజలకు తన ముఖమే చూపించలేదని కేవలం హైదరాబాదులోనే ఉండిపోయారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు.

మరింత సమాచారం తెలుసుకోండి: