ఈ క్రమంలోనే ప్రస్తుతం మాజీ ఆటగాళ్లు అందరితో కలిసి లెజెండ్స్ లీగ్ క్రికెట్ టి20 టోర్నమెంట్ నిర్వహిస్తూ వస్తుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఈ 20 టోర్నమెంట్ లో అటు అన్ని దేశాలకు సంబంధించిన సీనియర్ మాజీ ఆటగాళ్లు అందరు కూడా మళ్లీ మైదానంలోకి దిగి ఒకప్పటిలా హోరాహోరీగా మైదానంలో పోటీపడతారు. ఈ క్రమంలోనే భారత క్రికెట్ నుంచి కూడా ప్రస్తుతం లెజెండ్స్ గా కొనసాగుతున్న ఎంతోమంది బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. జనవరి 20 వ తేదీ నుంచి 27 వరకూ ఒమన్ వేదికగా లెజెండ్స్ లీగ్ క్రికెట్ టి20 టోర్నమెంట్ జరగబోతుంది. అయితే ఇక ఈ సారి అందరూ మాజీ క్రికెటర్లు బరిలోకి దిగబోతున్నారాని భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో సచిన్ టెండూల్కర్ షాక్ ఇచ్చాడు.
కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య లెజెండ్స్ లీగ్ క్రికెట్ టి20 టోర్నమెంట్ నుంచి తాను తప్పు కుంటున్నాను అంటూ ప్రకటించాడు సచిన్ టెండూల్కర్. దీంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ ఇండియన్ మహారాజా టీం కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఇక ఇటీవల తాను లీగ్ నుంచి తప్పుకుంటున్న అంటూ ప్రకటించడంతో ప్రస్తుతం మహారాజ్ టీం కి కొత్త కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ జట్టుకు వైస్ కెప్టెన్గా మొహమ్మద్ కైఫ్ వ్యవహరించ బోతున్నాడు. ఇక వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్సీలోని అటు లెజెండ్ జట్టు ఎలా రాణించ బోతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.