శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు అన్న విషయం తెలిసిందే.  స్టార్ క్రికెటర్ అయినప్పటికీ చిన్న పిల్లాడిలా సోషల్ మీడియాలో ప్రవర్తించడం చేస్తూ ఉంటాడు శిఖర్ ధావన్.  ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ కు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా కెప్టెన్సీ చేపట్టిన శిఖర్ ధావన్ జట్టులోని ఆటగాళ్లు అందరిలో కూడా తన అల్లరితోఎనర్జీ నింపుతున్నాడు అని చెప్పాలి.


 ఆటగాళ్లలో ఉన్న ఒత్తిడిని పోగొట్టేందుకు తనదైన శైలి  లోనే ఆటగాళ్లు అందర్నీ కలుపు కుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ లో అడుగు పెట్టగానే ఆటగాళ్లు అందరితో హాయ్ చెప్పించాడు. ఇందుకు సంబంధించిన వైరల్ గా మారి పోయింది. ఇప్పుడు వన్డే సిరీస్లో క్లీన్ స్వీప్ తర్వాత కూడా డ్రెస్సింగ్ రూంలో ఇదే రీతిలో అల్లరి చేసాడు శిఖర్ ధావన్. యువ ఆటగాళ్లు అందరూ ఒత్తిడిని ఎదుర్కొంటు అద్భుతంగా రాణించారు అంటూ ముందుగా కోచ్ రాహుల్ రాహుల్ ఆటగాళ్లను ప్రశంసించాడు.


 ఆ తర్వాత కెప్టెన్ శిఖర్ ధావన్ ఇదే విషయం పై మాట్లాడుతూ.. ఆటగాళ్లు అందరు బాగా రాణించారు. యువ ఆటగాళ్లు సూపర్ అంటూ చెప్పి.. ఇక అందరినీ తన దగ్గరికి రావాలి అంటూ పిలుస్తాడు శిఖర్ ధావన్. ఈ క్రమం లోనే ఆటగాళ్లందరూ తన దగ్గరికి వచ్చిన తర్వాత నేను మన మందరం ఎవరిమి అని అడుగుతాను.. మీరందరూ  ఛాంపియన్స్ అంటూ గట్టిగా అరుస్తూ చెప్పాలి అంటూ ఒక స్లోగన్ చెబుతాడు.. శిఖర్ ధావన్ చెప్పినట్లుగానే యువ ఆటగాళ్లు అందరూ గట్టిగా అరుస్తూ మనమందరం ఎవరిమీ అంటే చాంపియన్స్ అంటూ చెబుతారు మిగతా ప్లేయర్స్.  ఇందుకు సంబంధించిన వీడియో  వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: