రేపు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం 140 కోట్ల మంది భారతీయులు మాత్రమే కాదు క్రికెట్ ప్రపంచం మొత్తం వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఫైనల్ ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పోరు జరగబోతుంది. ఈ రెండు టీమ్స్ లో ఎవరు విజేతగా నిలుస్తారు.. అనే విషయాన్ని ఇక క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. చాలా మటుకు అయితే సొంతగడ్డపై సూపర్ ఫామ్ లో కొనసాగుతూ వరస విజయాలతో  దూసుకుపోతున్న టీమ్ ఇండియా నే టైటిల్ విజేత అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు.


 అయితే ప్రస్తుతం  వరల్డ్ కప్ ఫైనల్ నేపథ్యంలో ఇక ఎవరు ఏం చెప్పినా కూడా  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. అయితే ఈ మెగా టోర్నీ బిగ్ ఫైట్ లో విజేత ఎవరు అని ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ జగన్నాథ్ గురూజీ  అంచనా వేశారు. రెండువైపులా జాతకాలను పోల్చి చూస్తే ఆస్ట్రేలియాపై భారత్ దే పైచేయిగా ఉంటుందని చెప్పుకొచ్చారు  ఐసీసీ ప్రపంచ కప్ 2023 ట్రోఫీని అన్ని విధాలుగా భారత్ కైవసం చేసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జాతకం కంటే టీమిండియా.. జాతకమే ఎంతో మెరుగ్గా బలంగా ఉంది అంటూ తెలిపారు ఆయన.


 అంతేకాకుండా ఆటగాళ్లకు ఇది ఉత్సాహం.. చిత్తశుద్ధి చిత్తశుద్ధి అంకిత భావాన్ని అందిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు  ఆయన సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన పోస్ట్ పెట్టారు  ఇక రోహిత్ శర్మ జాతకం గురించి చెబుతూ.. రోహిత్ గ్రహస్థానాలు అమరికలు.. 2011 ప్రపంచకప్ లో మహేంద్రసింగ్ ధోనికి పోలి ఉన్నాయి  అంటూ చెప్పుకొచ్చారు.  అతను ప్రపంచ కప్ లో ట్రోఫీని ఎత్తి చరిత్ర సృష్టిస్తాడని జోష్యం చెప్పారు పండిత్ జగన్నాథ్ గురూజీ. ఇక ఆయన మాటలతో ప్రస్తుతం టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc