ఎలక్షన్స్ వచ్చాయి అంటే చాలు హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకు ప్రజలను పట్టించుకోని నాయకులు అందరూ కూడా ప్రజల్లో చేరిపోతూ ఉంటారు. తాము ప్రజల మనిషిమి అని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాదు ఎన్నో హామీలను కురిపిస్తూ ఓటర్ మహాశయులను ఆకట్టుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇలా పార్టీల తీరు నచ్చని ఎంతోమంది అభ్యర్థులు ఎలాంటి పార్టీ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఎన్నికల బరిలో నిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇలా ఎన్ని పార్టీల నుంచి అభ్యర్థులు బరిలోకి దిగిన.. ఇక ఇండిపెండెంట్గా పోటీ చేసినా.. ఎవరికి ఓటు వేయాలి అనే తుది నిర్ణయం మాత్రం ఓటర్ల చేతిలోనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఎన్నికల పోలింగ్ సమయంలో ఓటర్లు తమ తీర్పును వెలువరిస్తూ ఉంటారు. ఒకవేళ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చకపోతే ఓటర్లు ఇక నోటా ద్వారా తమ వ్యతిరేకతను తమ అసంతృప్తిని వ్యక్తపరిచేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఏ ఎన్నికల్లో చూసిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు పోల్చి చూస్తే నోటా కి అతి తక్కువ ఓట్లు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం పదిమంది అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం.



 ఖేడ్ ఎన్నికల ఫలితాల్లో 10 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. నోటా కి 858 ఓట్లు రాగా.. వివిధ పార్టీలు ఇండిపెండెంట్గా పోటీ చేసిన పదిమంది అభ్యర్థులకు ఇక 858 కంటే తక్కువ ఓట్లు రావడం గమనార్హం. జీవన్ 136, అంకుష్కు 126, బి.ఎం.పి అభ్యర్థి ప్రకాష్ రాథోడ్ కు 648, నరసింహులుకు 340, రమేష్ నాయక్  148, గోపాల్ రెడ్డికి 574, అంజా గౌడ్ కు 400, నర్సారెడ్డికి 154, వెంకటేశ్వరరావుకి 381, అశోక్ గౌడ్ కి 773 ఓట్లు  వచ్చాయి. ఇలా ఈ పది మంది అభ్యర్థులు కూడా నోటా కంటే తక్కువ ఓట్లను దక్కించుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: