నటి తేజస్వి మదివాడ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు.. ఈమె మొదట సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయింది. ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ అంతగా ఏవీ ఈమెకు స్టార్డమ్ ని తెచ్చి పెట్టలేకపోయాయి. ఇక తాజాగా ఈమె కమిట్మెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమా ఆగస్టు 19వ తేదీన విడుదల చేయడం జరిగింది. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రం ట్రైలర్ చూసిన ప్రేక్షకుల సైతం ఈ చిత్రం ఒక బూతు చిత్రమని అనుకోవద్దని తెలియజేసింది.


సినిమా ఎమోషనల్ మెసేజ్ తో కూడి ఉన్నదని తెలియజేసింది తేజస్వి. ఇక ఈమె బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్న సంగతి అందరికీ తెలిసినదే.. అయితే బిగ్ బాస్ వల్ల తనకేమి లాభం రాలేదని తేజస్వి షాపింగ్ కామెంట్లు చేసింది. ఇక కమిట్మెంట్ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అసభ్యకరమైన డైలాగులు వల్ల ఈమె ఈ మధ్య చాలా ట్రోలింగ్ ఎదుర్కోవలసి వస్తోంది.. ఈ సినిమా ప్రమోషన్లలో తేజస్వి మాట్లాడుతూ.. బిగ్ బాస్ విన్నర్ కౌశల్ పైన పలు ఆశ్చర్యకరమైన విషయాలను తెలిపింది.


తెలుగు సినీ ఇండస్ట్రీ ఒకలాగా అయితే బిగ్ బాస్ మరొక లాగా ఉంటుందని తెలిపింది. బిగ్ బాస్ హోస్ట్ అయినా నాని కూడా  తనని తిట్టేవారని అందువల్ల నేను చాలా మనోవేదనకు గురయ్యానని తనని సోషల్ మీడియాలో చెత్త మీమ్స్ తో చాలా బ్యాడ్ చేశారని.. కౌశల్ ఆర్మీ తనని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా తనని టార్గెట్ చేసి మరీ హింసించారని తెలిపింది. ఇక బిగ్ బాస్ తర్వాత తను రెండు సంవత్సరాలు ఇండియా ని వదిలి వెళ్ళిపోయానని. ఈ బాధలన్నీ  భరించటానికే తను మద్యానికి బానిస అయ్యానని తెలియజేసింది. ఇప్పటికీ మర్చిపోలేక ఉండాలని తెలుస్తోంది తేజస్వి..

మరింత సమాచారం తెలుసుకోండి: