ధవళేశ్వరం ప్రాజెక్టు రూపకర్త సర్ ఆర్థర్ కాటన్ జయంతిని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు  స్పందించారు. కాటన్ జయంతి సందర్భంగా ఆ నిస్వార్థ ప్రజాసేవకుని స్మృతికి నివాళి అర్పిస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చునో కాటన్ మహాశయుడు రుజువు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతిని సందర్భంగా ఆయన గొప్పదనాన్ని స్మరించుకున్నారు. నీటితో ప్రజల తలరాతలను మార్చవచ్చునని నిరూపించిన కాటన్ మహానుభావుని స్ఫూర్తితోనే పోలవరం ప్రాజెక్టు పూర్తికి సంకల్పించి, 70శాతం ప్రాజెక్టు పనులను టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయగలిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. అలాంటి ప్రాజెక్టు పనులు ఈరోజు పడకేయడం చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు.

 

సాంకేతిక పరిజ్ఞానం ఏమాత్రం అందుబాటులో లేని రోజుల్లో రెండు జిల్లాల పరిధిలో ఆనకట్టను, కాలువల వ్యవస్థలను కేవలం ఐదేళ్ల వ్యవధిలో పూర్తి చేసిన కాటన్ సంకల్పం మాటలకు అందనిది అని కొనియాడారు. అనాటి టెక్నాలజీ ఉపయోగించి ఆయన అందరికీ ఒక స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.  ఈ కాలం యువత ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: