తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది . ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ అవుతున్నారు. నేడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో దాదాపు గంట పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో ఆయన దాదాపు రెండు గంటల పాటు భేటీ అయినట్లుగా తెలిసింది.

అలాగే మరికొందరు కేంద్ర మంత్రులు కూడా రేపు ఎల్లుండి సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉందని అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా సీఎం కేసీఆర్ భేటీ అయ్యే సూచనలు ఉన్నాయని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. కేంద్ర జనశక్తి శాఖ మంత్రి అలాగే పలువురు కేంద్ర మంత్రులను గత ఇరవై రోజుల్లో రెండు సార్లు సీఎం కేసీఆర్ కలవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: