కళ్లుచెదిరే లాభం పొందాలని భావిస్తే స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వాలి. అయితే ఇక్కడ భారీ రిస్క్ ఉంటుందని తెలుసుకోవాలి. రిస్క్ ఉన్నప్పుడే లాభం కూడా ఉంటుందని గమనించాలి. స్టాక్ మార్కెట్లో అన్ని స్టాక్స్ ఒకే రకమైన రాబడి అందించవు.. కానీ, ఒక్క స్టాక్ మార్కెట్ మాత్రం మంచి లాభాలను ఇస్తుంది.
విషయానికొస్తే.. ఆర్కిడ్ ఫార్మా అనే స్టాక్ గత ఆరు నెలల కాలం లో ఏకంగా దాదాపు 15000 శాతం పరుగులు పెట్టింది. ఆల్టైమ్ గరిష్టాల తో దూసుకుపోతున్న బిట్ కాయిన్ కూడా ఇంతటి లాభాన్ని అందించలేకపోవడ విశేషం అనే చెప్పాలి. ఆర్కిడ్ ఫార్మా షేరులో ఆరు నెలల కిందట రూ.10 వేలు పెట్టి ఉంటే ఇప్పుడు దీని విలువ రూ.15 లక్షలకు చేరుతుంది అని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
2020 నవంబర్ 3న ఆర్కిడ్ ఫార్మా షేరు ధర రూ.18 వద్ద ఉండేది. ఇప్పుడు దీని ధర రూ.2,680 స్థాయికి చేరింది. ఏప్రిల్ 1 న ఆర్కిడ్ ఫార్మా షేరు ధర 52 వారాల గరిష్ట స్థాయికి తాకింది. రూ.2680 స్థాయికి చేరింది. షేరు రీలిస్టింగ్ దగ్గరి నుంచి ఇన్వెస్టర్లకు కళ్లుచెదిరే రాబడిని అందించింది. ధనూకా ల్యాబ్స్ ప్రస్తుతం ఆర్కిడ్ ఫార్మా కంపెనీని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ షేర్ 1800 లకు చేరువలో ఉంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి