ఇదిలావుంటే, ఇప్పటికే ఎండలు ముదురుతుండటంతో రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో లోడ్ రిలీఫ్ పేరుతో ఇప్పటికే గ్రామాల్లో ఐదు గంటలపాటు పవర్ కట్ అమలు చేస్తున్న ప్రభుత్వం.. దసరా తర్వాత పట్టణాలకు, నగరాలకు కూడా విస్తరించనుంది. దీంతో ఈ ప్రాంతాల్లో నివసించే మధ్య తరగతి ప్రజలు పవర్ కట్కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. పవర్ కట్ను నిరోధించేందుకు ఇన్వర్టర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇదే అదునుగా భావిస్తున్న ఇన్వెర్టర్, బ్యాటరీలు సరఫరా చేసే కంపెనీలు, షాపుల యజమానులు వీటి ధరను అమాంతంగా పెంచేశారు. అయితే ప్రస్తుతానికి వీటి ధర ఓల్డ్ స్టాక్ మూలంగా యథావిధిగా ఉందని, కానీ విద్యుత్ కోతలుపెరిగే కొద్ది ఇన్వర్టర్ల ధరలు పెరిగే అవకాశం ఉందనీ షాపు యజమానులు అంటున్నారు. మొత్తంమీద విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తుందన్న ప్రచారం నేపధ్యంలో గృహ వినియోగదారులు ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. గృహాల్లో ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.
ఇదిలావుంటే, ఇప్పటికే ఎండలు ముదురుతుండటంతో రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో లోడ్ రిలీఫ్ పేరుతో ఇప్పటికే గ్రామాల్లో ఐదు గంటలపాటు పవర్ కట్ అమలు చేస్తున్న ప్రభుత్వం.. దసరా తర్వాత పట్టణాలకు, నగరాలకు కూడా విస్తరించనుంది. దీంతో ఈ ప్రాంతాల్లో నివసించే మధ్య తరగతి ప్రజలు పవర్ కట్కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. పవర్ కట్ను నిరోధించేందుకు ఇన్వర్టర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇదే అదునుగా భావిస్తున్న ఇన్వెర్టర్, బ్యాటరీలు సరఫరా చేసే కంపెనీలు, షాపుల యజమానులు వీటి ధరను అమాంతంగా పెంచేశారు. అయితే ప్రస్తుతానికి వీటి ధర ఓల్డ్ స్టాక్ మూలంగా యథావిధిగా ఉందని, కానీ విద్యుత్ కోతలుపెరిగే కొద్ది ఇన్వర్టర్ల ధరలు పెరిగే అవకాశం ఉందనీ షాపు యజమానులు అంటున్నారు. మొత్తంమీద విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తుందన్న ప్రచారం నేపధ్యంలో గృహ వినియోగదారులు ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. గృహాల్లో ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.