అయితే కొంతమంది అమ్మాయిలు ఇలా ప్రియుడు చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకుంటుంటే.. మరి కొంతమంది మాత్రం న్యాయపోరాటం చేస్తూ ఏకంగా ప్రియుడు ఇంటి ముందు ధర్నా చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. కామారెడ్డి జిల్లా తుజాల్పూర్ లో ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్లపాటు ఆ యువతీ యువకులు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇక ఒకరి పేరును ఒకరు టాటూ కూడా వేయించుకున్నారు. కానీ యువకుడు ముఖం చాటేసాడు. దీంతో మోసపోయాను అని గ్రహించిన యువతి ప్రియుడి ఇంటి ఎదుట బయట నుంచి నిరసన తెలిపింది.
దోమకొండకు చెందిన మెతుకు మౌనిక డిగ్రీ చేస్తున్న సమయం లోనే తుజాల్పూర్ గ్రామానికి చెందిన నాగరాజు గౌడ్ తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తగా ప్రేమగా మారింది. ఆరేళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమ లో మునికి తేలారు. ఒకరి పేరును మరొకరు టాటూలు కూడా వేసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని గుడ్డిగా మౌనికను నమ్మించాడు నాగరాజు. తీరా ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడగడం తో నిరాకరించడమే కాకుండా దుర్భాషలాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది బాధితురాలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన.. పెళ్ళి చేసుకునేందుకు ఒప్పుకోలేదని అందుకే అతని ఇంటి ముందు నిరసనకు దిగినట్లు చెబుతుంది. న్యాయం చేయాలంటూ కోరుతుంది.