ఈ అక్రమాల కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు అన్యాయమయ్యారని నారా లోకేశ్ అంటున్నారు. స్పోర్ట్స్ కోటాలో కోతలతో ఆశావహులు ఆందోళనతో ఉన్నారని నారా లోకేశ్ తెలిపారు. డిజిటల్, మాన్యువల్ వేల్యూయేషన్లో 202 మంది అవుటయ్యారని నారా లోకేశ్ పేర్కొన్నారు. అవకతవకలపై గవర్నర్ దృష్టిసారించి న్యాయ విచారణ జరపాలని నారా లోకేశ్ డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 1 ఇంటర్య్వూల ఎంపికలో అక్రమాల కారణంగా వందలాది మంది ప్రతిభావంతులకు తీరని అన్యాయం జరిగిందని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ సర్కారువారి పాట ఆట కట్టిస్తామంటున్న నారా లోకేశ్.. 30కి పైగా సీబీఐ, ఈడీ కేసుల్లో ఏ1 నిందితుడిగా వున్న సీఎం వైఎస్ జగన్ నిర్వహణలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కూడా అవకతవకలతోనే సాగిందని మండిపడ్డారు. డిజిటల్ విధానంలో ఎంపికైన 326 మందిలో 124 మంది మాత్రమే మాన్యువల్ వేల్యూయేషన్లో ఎంపిక కావడం వెనుక మతలబేంటని నారా లోకేశ్ జగన్ సర్కారును ప్రశ్నించారు.
డిజిటల్లో మాయా జాలం జరిగిందా... మాన్యువల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయా అనే విషయం ప్రభుత్వం తేల్చాలని నారా లోకేశ్ డిమాండ్ చేసారు. గతంలో ఎంపికై తాజా జాబితాలో 202 మంది పేర్లు గల్లంతు కావడంపై ఏం సమాధానం చెబుతారని నారా లోకేశ్ నిలదీస్తున్నారు. డిజిటల్ వేల్యూయేషన్లో 142 మంది తెలుగు మీడియం వాళ్లు ఎంపికైతే.. మాన్యువల్లో 47 మంది మాత్రమే సెలెక్ట్ కావడం వెనుక ఏ జగన్ నాటకం నడిచిందని నారా లోకేశ్ మండిపడ్డారు.