
చైనా ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గుఒ జియాకున్ ఈ చర్యను సానుకూలంగా అభివర్ణించారు. సరిహద్దు ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, గత ఏడాది అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సమావేశం తర్వాత సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈ సమావేశంలో రెండు దేశాలు సరిహద్దు వివాదాలను పరిష్కరించడానికి, సహకారాన్ని పెంపొందించడానికి అంగీకరించాయి.ఈ వీసా పునరుద్ధరణ భారత టూరిజం రంగానికి ఊపిరిపోస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
2019లో భారత్ను సందర్శించిన 3 లక్షల మంది చైనా పర్యాటకులు సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాలకు ఆకర్షితులయ్యారు. ఈ నిర్ణయం ద్వారా ఢిల్లీ, ఆగ్రా, వారణాసి వంటి ప్రాంతాల్లో పర్యాటక ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో, భారతీయులు చైనా సందర్శనకు కూడా ఈ చర్య ఊతమిస్తుందని ఆశిస్తున్నారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు బలోపేతం కావడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు