బంగారం ధర చాలా రోజులకు భారీగా తగ్గింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వందల రూపాయిలు తగ్గింది. కరోనా వైరస్ వచ్చిన ఈ మూడు నెలల్లో ఎప్పుడు ఇంత తగ్గలేదు. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్ లు అతి దారుణంగా పడిపోయాయ్. దీంతో ఇన్వెస్టర్లు అంత బంగారంపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకేముంది బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 

 

కేవలం అంటే కేవలం మూడు నెలల్లో బంగారం ధర ఏకంగా 6 వేలకుపైగా పెరిగింది. ఇంకా సంవత్సరంలో ఏకంగా 16 వేలు పెరిగింది. సంవత్సరం క్రితం వరుకు 31 వెయ్యి ఉన్న బంగారం ధర ఇప్పుడు ఏకంగా 46 వేలు దాటింది.. ఇలా బంగారం ధర పెరగడానికి కారణం అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ ఎక్కువ అవుతే.. మరో వైపు కరోనా వైరస్ కారణం అయ్యింది. 

 

ఇంకా నేడు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యరెట్ల బంగారం ధర 370 రూపాయిల తగ్గుదలతో  48,680 రూపాయలకు చేరింది. ఇంకా అలానే నేడు 22 క్యారెట్ల బంగారం ధరపై 370 రూపాయిల తగ్గుదలతో 44,870 రూపాయలకు చేరింది. ఇంకా వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. దీంతో వెండి ధర కూడా భారీగా తగ్గింది. 

 

నేడు కేజీ వెండి ధర 50 రూపాయిలు తగ్గుదలతో 48,150 రూపాయలకు చేరింది. అయితే లాక్ డౌన్ సమయంలో కేజీ వెండి ధర 40 వేల రూపాయిల వద్ద ఉండగా ఇప్పుడు మళ్లీ 48 వేలకు చేరింది. ఇలా నేడు బంగారం ధరలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నం, అమరావతిలో కూడా బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. ఢిల్లీ, ముంబై మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.        

మరింత సమాచారం తెలుసుకోండి: