బంగారం కొనుగోలు దారులకు షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి.. భారతీయ మార్కెట్ లో బంగారం ధర తగ్గిందని నిపుణులు అంటున్నారు. అయితే మొన్న భారీగా పెరిగిన బంగారం ధర నిన్న కాస్త పెరిగింది...దీంతో ఈరోజు కూడా ధరలు పెరిగాయి..లాక్ డౌన్ లో 60000 వరకు వెళ్ళిన బంగారం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం 45 వేలకు పైగా కొనసాగుతుంది..


భారత దేశంలో హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు బంగారం రేట్ల విషయానికొస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 పరుగులు పెట్టింది. దీంతో రేటు రూ.47,840కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.590 పెరుగుదలతో రూ.43,850కు ఎగసింది. నిన్నటి రేటుతో పోలిస్తే ఈ రోజుకు ధర ఓ మేరకు భారీ షాక్ ఇస్తుంది..


ఇప్పుడు బంగారం రేట్లను ఆధారంగా చేసుకొని వెండి ధర కూడా పైపైకి వస్తుంది. నిన్న కాస్త పెరిగిన కిలో వెండి ధర ఈరోజు మాత్రం అందరికీ షాక్ ఇస్తుంది. కేజీ వెండి ధర ఏకంగా రూ, 1300 పెరిగింది. దీంతో రేటు రూ.75,700కు ఎగసింది. వెండి వస్తువులను కొనుగోలు చేసేవారికి ఇది చేదు వార్తే.. ఇప్పుడు ప్రజలు అంతా బంగారం వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు..ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు చూస్తే..బంగారం ధర ఔన్స్‌కు 0.09 శాతం పెరుగుదలతో 1806 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పైకి కదిలింది. ఔన్స్‌కు 0.13 శాతం పెరుగుదలతో 27.72 డాలర్లకు ఎగసింది.వీటి రేట్లు పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి దీపావళికి అయిన ఈ రేట్లు తగ్గుతాయో.. లేదో చూడాలి ..  ఎంతగా బంగారు ధర లలో మార్పులు కనిపించిన కొనేవాళ్లు కొంటూనే ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: