పసిడి ప్రియులకు భారీ శుభవార్త... గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు ఈరోజు కిందకు దిగి వస్తున్నాయి. పసిడి రేటు పడిపోయింది. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పడిపోయింది. బంగారం కొనాలనుకునే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర తగ్గితే వెండి రేటు మాత్రం పైకి కదిలింది.. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ధరలు తగ్గిపోయాయి. దీంతో బంగారం కొనేవాల్లు నేడు ఎక్కువ అయ్యారు. రేపు శివరాత్రి పండుగ కనుక మహిళలు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.


హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు చూస్తే పూర్తిగా తగ్గిపోయాయి.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 దిగొచ్చింది. దీంతో రేటు రూ.45,440కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.350 క్షీణతతో రూ.41,650కుl తగ్గింది. బంగారం ధరలు పూర్తిగా కిందకు వస్తున్న కూడా వెండి ధరలు మాత్రం పరుగులు పెడుతున్నాయి. వెండి ధర కేజీకి రూ.100 పెరిగింది. దీంతో రేటు రూ.71,100కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధరల్లో మార్పులు వచ్చాయని నిపుణులు అంటున్నారు.


అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు ఒకసారి పరిశీలిస్తే..బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.13 శాతం తగ్గుదలతో 1714 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.53 శాతం క్షీణతతో 26.04 డాలర్లకు తగ్గింది. బంగారు ధరలు పెరగడానికి కారణం చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు మొదలగు అంశాలు బంగారం ధరల పై ప్రభావం చూపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: