అసలే కరోనా ఘోరంగా విజ్రుంభిస్తుంది.రోజు రోజుకి కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి.అలాగే వైరస్ సోకిందంటే రోగ నిరోధక శక్తి చనిపోవడం ఖాయం. కనుక ఈ టైంలో ఆహారం విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ స్విగ్గి, జొమాటో లేదంటే బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ అస్సలు తీసుకోకండి. మన ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారాన్నే తీసుకోండి. పండ్లు, కూరగాయలు మీ డైట్‌లో తప్పకుండా ఉండాలి. పాలకూర, టమాట, బీట్ రూట్ ఎక్కువగా తీసుకోండి. బాగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి.మీకు డయాబెటీస్ లేదా గుండె తదితర సమస్యలు ఉంటే వైద్యుల సూచన ప్రకారం ఆహారం తీసుకోవాలి. డైట్‌ను పాటిస్తూనే వ్యాయామం, యోగా వంటివి చేస్తుండాలి.బటర్ మిల్క్ (మజ్జిగ) కూడా ఆరోగ్యాన్ని అందిస్తుంది.జంక్ ఫుడ్ అస్సలు తీసుకోవద్దు. ప్యాకేజ్డ్ ఫుడ్ తినడానికి సులభంగానే ఉంటాయి. కానీ, ఇవి ఆరోగ్యాన్ని చెడగొడతాయి.


అలాగే కిచిడీలో ఉండే పప్పులు, అన్నం, కూరగాయలు మీకు బలాన్ని అందిస్తాయి. పైగా ఇది సులభంగా జీర్ణమవుతుంది. నీళ్లు ఎక్కువగా తాగండి. హైడ్రేషన్ ఎలాంటి అనారోగ్యం నుంచైనా త్వరగా కోలుకోడానికి ఉపయోగపడుతుంది. నీళ్లు మాత్రమే కాకుండా ఓఆర్ఎష్, కొబ్బరి నీరు, హెర్పల్ టీలు తీసుకోండి.నీటిలో నానబెట్టిన నట్స్, సీడ్స్ తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లే కాకుండా మంచి పోషకాలు కూడా ఉంటాయి. రాగి లేదా ఓట్స్‌లో ఫైబర్, విటమిన్-B, సంక్లిష్ట పిండి పదార్థాలు ఉంటాయి. రోజూ క్రమం తప్పకుండా గుడ్డు తినండి. కరోనా వల్ల జ్వరంతో బాధపడుతుంటే కిచిడీ తినండి.పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా కోవిడ్-19 నుంచి త్వరగా కోలుకోవచ్చు. రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పెంచే ఆహారాన్ని తీసుకోండి. మీరు తీసుకొనే ఆహారంలో విటమిన్-C, జింక్ ఉండేలా చూసుకోండి. కోవిడ్‌తో బాధపడుతున్నవారు ఇవి తప్పకుండా తీసుకోవాలి.ఇక ఈ డైట్ ని పాటించండి ఎలాంటి రోగాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: