ప్రతి రోజు శరీరానికి సరిపడా నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదే.ముఖ్యంగా జీర్ణక్రియ సంబంధిత సమస్యల నుంచి మరెన్నో సమస్యలకు మంచి నీరు పరిష్కారం అని తెలిసిందే.కానీ కొంతమందికి మాత్రం ఎప్పుడూ కూడా అధిక దాహం వేస్తుంది. అధిక దాహం వేస్తే ఖచ్చితంగా మీ ఆరోగ్యం చిక్కుల్లో పడ్డట్లే.శరీరం బలహీనంగా మారినా, శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు లభించకపోయినా తరచూ దాహం వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పదే పదే దాహం వేస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.రక్త హీనత సమస్యతో ఇబ్బంది పడే వారిలోనూ దాహం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో ఆర్బీసీ తక్కువగా ఉన్నప్పుడు కూడా మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది.ఇక కొన్ని అనారోగ్య సమస్యల కోసం ఉపయోగించే మందులను ఉపయోగించినా కూడా తరచూ దాహం వేస్తుంది. దీనికి కారణం కొన్ని మందులు మూత్ర విసర్జన లక్షణాన్ని కలిగిస్తాయి. ఇది అధిక దాహానికి కారణమవుతుంది.శరీరంలో కావాల్సినంత నీరు లేని సమయంలో కూడా పదే పదే దాహం వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనినే డీహైడ్రేషన్‌ సమస్యగా పిలుస్తుంటారు.


ఎక్కువగా చమటలు పట్టడం నిత్యం జ్వరం రావడం దీనికి లక్షణాలుగా చెప్పొచ్చు.మీకు అదే పనిగా పదే పదే అధిక దాహం కనుక వేస్తూంటే అది మధుమేహం లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను వైద్య పరిభాషలో పాలీడీప్సియాగా పిలుస్తారు. దీనికి కారణం.. డయాబెటిస్‌ కారణంగా ఇన్సులిన్‌ పనిచేయదు. దీంతో మూత్రం నుంచి గ్లూకోజ్‌ రావడం ప్రారంభమవుతుంది. మూత్రంలో గ్లూకోజ్‌ వెళ్లడం వల్ల శరీరానికి ఎక్కువ నీరు అవసరపడుతుంది. పదేపదే దాహం వేయడానికి ఇదే కారణమని చెబుతున్నారు.వేసవి కాలంలో దాహం వేయడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. అయితే వాతావరణం చల్లగా ఉన్నా పదే పదే దాహం వేస్తుంటే మాత్రం ఖచ్చితంగా అలర్ట్‌ అవ్వాల్సిందేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబట్టి మీకు పదే పదే అధిక దాహం వేస్తే ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించండి. పలు జాగ్రత్తలు తీసుకోండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: