క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి ఎక్స్ పోజింగ్ చేయదు. అంతేకాదు చాలామంది గ్లామర్ హీరోయిన్స్ లా కురచ దుస్తులు వేసుకోదు. అంతేకాదు ఆమె నటించే సినిమాలలో బూతు డైలాగులు కూడ వినిపించవు. అలాంటి సాయి పల్లవి శర్వానంద్ ఓపెన్ గా ఆమెతో వేసిన ఓకే బూతు జోక్ కు ఆశ్చర్యపడింది. 

ఈ ఆసక్తికర సంఘటన ఈమధ్య విడుదలైన ‘పడి పడి లేచే మనసు' మూవీని ప్రమోట్ చేస్తూ ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జరిగింది. ఈమూవీకి హిట్ టాక్ రాకపోయినా శర్వానంద్ సాయి పల్లవిల మధ్య కెమిస్ట్రీ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇద్దరూ మంచి పెర్ఫార్మర్లు కావడంతో స్క్రీన్ మీద వారి బదులుగా ఆపాత్రలే కనిపించాయి. 

ఈ పరిస్థుతులలో ఈసినిమాతో తామిద్దరం మంచి స్నేహితులం అయ్యామని ఎవరైనా మంచి అమ్మాయి కనిపిస్తే తాను ఆఅమ్మాయిని పెళ్లి చేసుకోమని శర్వానంద్ ను బలవంత పెడతానని అంటూ కామెంట్ చేసింది. ఈ కామెంట్ కు శర్వానంద్ సమాధానం ఇస్తూ తాను కూడ సాయి పల్లవి కోసం ఒక మంచి అబ్బాయిని వెతుకుతున్నానని ఈమూవీ షూటింగ్ నిమిత్తం ఆమధ్య తామిద్దరం విదేశాలకు వెళుతున్నప్పుడు ఎయిర్ పోర్ట్ లో ఒక పొడవైన తెల్లటి అబ్బాయి కనిపించినప్పుడు ఆఅబ్బాయిని పెళ్ళి చేసుకోమని తాను సాయి పల్లవికి సూచించిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 

ఈవిషయం పై సాయి పల్లవి వెంటనే స్పందిస్తూ ఆఅబ్బాయి పక్కన వేరే అమ్మాయి ఉంది కదా అని ప్రశ్నించినప్పుడు శర్వానంద్ నవ్వుతూ విదేశాలలో లివింగ్ రిలేషన్ షిప్ లు కొనసాగించడం సహజమే కదా అంటూ జోక్ చేసాడు. ఈఅనుకోని జోక్ కు సాయి పల్లవి ఒక్క క్షణం షాక్ అయినా వెంటనే తేరుకుని శర్వానంద్ నవ్వులతో శ్రుతికలిపింది. దీనితో ఈఇంటర్వ్యూ చూసిన వారికి సాయి పల్లవి మనస్తత్వాన్ని తట్టుకోవాలి అంటే అది ఒక్క ఫారెన్ అబ్బాయిలకు మాత్రమే సాధ్యం అవుతుందా అనే అనుమానాలు కలగడం సహజం..   


మరింత సమాచారం తెలుసుకోండి: