మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతీ ఏటా సంక్రాంతికి సినిమాల పోటీ అనేది భారీ ఎత్తున కనిపిస్తూ ఉంటుంది..ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో మన అగ్ర హీరోలు తమ తమ సినిమాలతో పోటీ పడుతుంటారు.. అలాగే  గతేడాది కూడా మహేష్ 'సరిలేరు నీకెవ్వరు',అల్లు అర్జున్ 'అల వైకుంటపురంలో' ,కళ్యాణ్ రామ్ 'ఎంతమంచి వాడవురా' సినిమాలతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ 'దర్బార్' అనే డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ అయింది.వీటిల్లో మహేష్, అల్లు అర్జున్ ల సినిమాలు భారీ విజయాలను నమోదు చేసాయి..ఇక ఇప్పుడు రాబోయే సంక్రాంతికి కూడా మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు మరియు ఒక డబ్బింగ్ సినిమా బరిలో దిగుతున్నాయి.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ - మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలిసి నటించిన 'మాస్టర్' చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి ఈ సీజన్ లోనే విడుదల చేస్తున్నారు.

'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇదే క్రమంలో యువ హీరో రామ్ పోతినేని నటించిన 'రెడ్' చిత్రాన్ని కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2021 జనవరి 14న విడుదల చేయనున్నారు. దేవదాస్' 'మస్కా' సినిమాల తర్వాత రామ్ నటించిన 'రెడ్' సినిమా సంక్రాంతి కి విడుదల అవుతుండటం గమనార్హం.మాస్ మహారాజ్ ర్రవితేజ నటించిన 'క్రాక్' చిత్రాన్ని కూడా 2021 సంక్రాంతి కానుకగా తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను  జనవరి 12న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అల్లుడు అదుర్స్' కూడా ఈ సీజన్ నే టార్గెట్ చేశారు. 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 15న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.అయితే ఈ నాలుగు సినిమాల్లో ఆడియన్స్ దృష్టి మాత్రం విజయ్ నటిస్తున్న మాస్టర్ సినిమాపైనే ఉంది..ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ వరుస హిట్స్ తో ఉంటే..సినిమాలో విజయ్ తో పాటు మరో అగ్ర హీరో సేతుపతి కూడా నటిస్తూ ఉండటం..ట్రైలర్ కు విపరీతమైన రెస్పాన్స్ రావడం తో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ సినిమా..   మరి ఇందులో ఏ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: