పవన్ కళ్యాణ్ హీరోగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎమ్ రత్నం హరిహర వీరమల్లు సినిమా అనే ను నిర్మిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమా మొదలై చాలా రోజులు అవుతుంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమాకు బ్రేక్ పడడం ఒక కారణమైతే పవన్ కళ్యాణ్ మరొక సినిమా షూటింగ్ లో పాల్గొనడం వల్ల ఈ చిత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది.

ఇటు క్రిష్ కూడా మధ్యలో కొండ పొలం అనే చిన్న బడ్జెట్ సినిమాను చేయడానికి వెళ్లిపోవడంతో కొన్ని రోజులు ఈ చిత్ర షూటింగ్ వాయిదా వేశారు. అలా ఈ సినిమా వాయిదా పడగా క్రిష్ కొండ పొలం సినిమా విడుదల తరువాత హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన పనులను మొదలుపెట్టాడు. అటు పవన్ కళ్యాణ్ తొందరలోనే భీమ్లా నాయక్ సినిమాను పూర్తి చేసుకుని ఈ చిత్ర పనులు మొదలు పెట్టనున్నాడు.  ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే మొదలు కానుందని వార్తలు వినపడుతున్నాయి. 

ఇక క్రిష్ తదుపరి సీన్స్ కు సంబంధించిన లొకేషన్ దొరికిన వెంటనే సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సంక్రాంతి  కి పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ విడుదల రోజున ఈ చిత్రం యొక్క టీజర్ విడుదల చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదల రోజు ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేసి ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా గిఫ్ట్ ఇవ్వాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్,  నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: