టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే . ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా , చందు మొండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కింది . కార్తికేయ మూవీ మంచి విజయం సాధించడం తో కార్తికేయ 2 మూవీ పై నిఖిల్ అభిమాను లతో పాటు సామాన్య సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు .


కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీన భారీ ఎత్తున విడుదల కానుంది . ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ సభ్యులు వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు . అందులో భాగంగా కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన నిఖిల్ కూడా వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమా కు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియ జేస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నిఖిల్ కార్తికేయ 2 సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు . తాజా ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడుతూ ... ఈ సినిమాకు ఇంటర్వెల్ ముందు వచ్చే 30 నిమిషాలు , అలాగే క్లైమాక్స్ ఈ సినిమాకు మేజర్ హైలైట్స్.  ఈ సినిమా చూస్తే ప్రేక్షకులకు అన్నమయ్య మూవీ లాంటి డివోషనల్ సినిమాను చూసిన ఫీలింగ్ కలుగుతుంది.  అలాగే అరుంధతి లాంటి త్రిల్లర్ మూవీ ని చూసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది  అని తాజా ఇంటర్వ్యూలో నిఖిల్ చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: