ఇండియన్ సినిమాస్ టాప్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకువెళ్లిపోయాడు. ఆ సినిమాతో తెలుగు సినిమాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి క్రేజ్‌ వచ్చింది.ఇక ఆయన తర్వాత తీసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ బ్లాక్‌బస్టర్‌ హిట్ అయ్యి తరువాత ఓటీటిలో ప్రపంచవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తోన్నాడు. ఇక రాజమౌళి - మహేష్ సినిమా 2023 ఫస్ట్ పార్ట్ లో మొదలుకానుంది.ఆ సినిమాను ఆయన భారీ బడ్జెట్ సినిమాలు బాహుబలి - ఆర్ ఆర్ ఆర్ ను మించిన స్థాయిలో తీయాలని…. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా మరింత ఎల్లలు దాటించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. అందుకు చాలా టైం వున్న ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకుంటు వెళ్లాలని అనుకుంటున్నాడు. అలాంటి హైప్‌ రావాలంటే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్  సినిమాను కూడా వరల్డ్ వైడ్‌గా రకరకాలుగా ప్రచారం చేసుకోవాలన్నది కూడా జక్కన్న ప్లాన్‌.


మహేష్ - రాజమౌళి కాంబోలో వచ్చే సినిమా ఎలాంటి జానర్ లో ఉంటుందనేది ఇంకెవరికీ తెలియదు. అయితే ఆఫ్రికా అడవులు అడ్వంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. దీనిపై ఈ స్టోరీ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అసలు కళ్లు చెదిరిపోయే యాక్షన్‌, విజువల్స్‌తో ఈ సినిమా ఉండబోతోందట.ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టాడు. నెగటివ్ టాక్ తో కూడా ఈ సినిమా 205 కోట్ల గ్రాస్, 125 కోట్ల షేర్ వసూళ్లు సాధించి సూపర్ స్టార్ స్టామినా ఏంటో నిరూపించింది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేష్ తన 28 వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: