శ్రీలంక బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో నటించి , బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం కూడా జాక్వలిన్ ఫెర్నాండెజ్ వరస బాలీవుడ్ మూవీ లలో నటిస్తూ ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా సుజిత్ దర్శకత్వం లో తేరకేక్కిన సాహో మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించి తెలుగు సినీ ప్రేమికుల మనసు కూడా దోచుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ కిచ్చా సుదీప్ హీరోగా అనుప్ బండారీ దర్శకత్వం లో తెరకెక్కిన అడ్వెంచర్స్ థ్రిల్లర్ మూవీ విక్రాంత్ రొనా లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ స్పెషల్ సాంగ్ ద్వారా  జాక్వలిన్ ఫెర్నాండెజ్ అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇలా వరుస క్రేజీ మూవీ అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న జాక్వలిన్ ఫెర్నాండెజ్ 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా జాక్వలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేస్ లో బాగంగా పటియాల కోర్టులో హాజరు అయింది. మనీ లాండరింగ్ కేసులో భాగంగా అరెస్టు కాకుండా జాక్వలిన్ ఫెర్నాండెజ్ పాటియాలా కోర్టు నుండి నవంబర్ 10 వరకు మధ్యంతర బెయిల్ ను తెచ్చుకుంది.  నిన్నటి తో ఈ బెయిల్ ముగుస్తున్నందున దాన్ని పొడిగించాలి అంటూ ఆమె పిటిషన్ వేసింది. దీనిపై వాదనలు ప్రస్తుతం జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: