వెయ్యికి పైగా సినిమాలు, 20వేలకు పైగా పాటలు, ఇదీ వాణీ జయరాంగారు సొంతం చేసుకున్న తిరుగులేని రికార్డు. కేవలం ఆమె మూవీ సాంగ్సే కాదు, వేల సంఖ్యలో భక్తి గీతాలను కూడా పాడారు వాణీ జయరాం. 1971లో తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాలుగా తన గానాన్ని కొనసాగిస్తున్నారు.ఇక తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మళయాలం, ఒరియా, హిందీతోపాటు మొత్తం 19 భాషల్లో పాటలు పాడిన ఘనత సింగర్ వాణీ జయరామ్ది.ఇక తెలుగులో మానస సంచరరే, దొరకునా ఇటువంటి సేవ, ఎన్నెన్నో జన్మల బంధం నీదీనాదీ, ఆనతినీయరా.. లాంటి ఎన్నో మధురమైన పాటలతో తన ముద్ర వేసుకున్నారు వాణీ జయరాం. తెలుగులో ఆమె పాడింది తక్కువ పాటలే అయినా కానీ తెలుగు పాటలతోనే ఏకంగా రెండుసార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు వాణి. ఇక తమిళ్ మూవీ అపూర్వ రాగంగళ్తో మొదటిసారి నేషనల్ అవార్డుకి ఎంపికైన వాణి, ఇంకా ఆ తర్వాత తెలుగు లైన శంకరాభరణం అలాగే స్వాతికిరణంతో ఏకంగా రెండుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా నిలిచారు.
వెయ్యికి పైగా సినిమాలు, 20వేలకు పైగా పాటలు, ఇదీ వాణీ జయరాంగారు సొంతం చేసుకున్న తిరుగులేని రికార్డు. కేవలం ఆమె మూవీ సాంగ్సే కాదు, వేల సంఖ్యలో భక్తి గీతాలను కూడా పాడారు వాణీ జయరాం. 1971లో తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాలుగా తన గానాన్ని కొనసాగిస్తున్నారు.ఇక తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మళయాలం, ఒరియా, హిందీతోపాటు మొత్తం 19 భాషల్లో పాటలు పాడిన ఘనత సింగర్ వాణీ జయరామ్ది.ఇక తెలుగులో మానస సంచరరే, దొరకునా ఇటువంటి సేవ, ఎన్నెన్నో జన్మల బంధం నీదీనాదీ, ఆనతినీయరా.. లాంటి ఎన్నో మధురమైన పాటలతో తన ముద్ర వేసుకున్నారు వాణీ జయరాం. తెలుగులో ఆమె పాడింది తక్కువ పాటలే అయినా కానీ తెలుగు పాటలతోనే ఏకంగా రెండుసార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు వాణి. ఇక తమిళ్ మూవీ అపూర్వ రాగంగళ్తో మొదటిసారి నేషనల్ అవార్డుకి ఎంపికైన వాణి, ఇంకా ఆ తర్వాత తెలుగు లైన శంకరాభరణం అలాగే స్వాతికిరణంతో ఏకంగా రెండుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా నిలిచారు.