తమిళ స్టార్ సూర్య క్రేజీ కాంబినేషన్ ని రిపీట్ చేయబోతున్నాడు. ఫ్లాప్స్ తో వెనుకబడ్డ
కోలీవుడ్ స్టార్ మళ్లీ ఆ దర్శకుడినే నమ్ముకున్నాడు. తన కెరీర్ ని మార్చేసే హిట్ ఇచ్చిన దర్శకుడితో సూర్య ముచ్చటగా మూడో
సినిమా చేయబోతున్నాడు. స్టైలీష్ మేకింగ్ కు కేరాఫ్ అడ్రస్ అయిన ఆ
డైరెక్టర్ సూర్యకు మరో హిట్ ఇస్తాడా మారి.
వరుస ఫ్లాప్స్ తో సూర్య అటు తమిళంలో ఇటు తెలుగులో క్రేక్ కోల్పోతున్నాడు. సింగం సిరీస్ తర్వాత ఈ హీరోకి మళ్లీ ఆ రేంజ్
సక్సెస్ పడలేదు. ఎన్జీకే, గ్యాంగ్ లాంటి కమర్షియల్ సినిమాలు చేసిన బందోబస్త్ లాంటి ప్రయోగం చేసినా హిట్ దక్కలేదు. అయినప్పటికీ సూర్య మాత్రం తనదైన శైలిలో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ
హీరో ఓ క్రేజీ
డైరెక్టర్ తో క్రేజీ మూవీకి సన్నాహాలు చేస్తున్నట్టు వినిపిస్తోంది.
సూర్య ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో సూరరై పోట్రులో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు లేటెస్ట్ గా
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మరోసారి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గతంలో ఈ కాంబినేషన్ లో కాకా, సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాకా సినిమాలోనే తెలుగులో
వెంకటేష్ ఘర్షణ సినిమాగా రిమీక్ చేశాడు. దీంతో ఈ కాంబినేషన్ పై
ఆడియన్స్ లో ఎక్కడ లేని క్యూరియాసిటీ ఏర్పడుతోంది.
వచ్చే ఏడాది సూర్య,
గౌతమ్ మీనన్ ల కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లుతోందని తెలుస్తోంది. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానల్ లో ఈ
మూవీ తెరకెక్కుతుండటం విశేషం. ఎన్నై అరిందాల్ తర్వాత
గౌతమ్ మీనన్ కు కూడా మరో హిట్ దక్కలేదు.
హీరో విక్రమ్ తో రూపొందిస్తున్న ధృవ నక్షత్రం రెండేళ్లు విడుదల కావడం లేదు. ఎన్నై నొక్కి పాయుమ్
తోట సినిమా సైతం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో చిక్కుకుంది. మరి కొత్త సినిమాతోనైనా హీరోగా సూర్యకు డైరెక్టర్ గా
గౌతమ్ మీనన్ కు హిట్ అందిస్తుందో లేదో చూడాలి.