గత ఏడాది మజిలీ తో పాటు తన మామయ్య విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించిన వెంకీ మామ సినిమాలతో రెండు అద్భుత విజయాలు తన ఖాతాలో వేసుకున్న చైతన్య, ప్రస్తుతం నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. క్లాస్ మూవీస్ తీయడం లో మంచి దిట్టగా పేరు గాంచిన శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఎంతో గ్రాండ్ లెవెల్లో ప్రారంభం అయింది. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తో కలిసి శేఖర్ తన అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతన్య సరసన ఫిదా భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. 

 

యువతను ఆకట్టుకునేలా హృదయానికి హత్తుకునే ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ గా దీనిని తెరకెక్కిస్తున్న శేఖర్, ఈ సినిమా ద్వారా మరొక్కసారి యువత దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నారట. చైతన్య తన కెరీర్ లో ఒక విభిన్న పాత్రను ఈ సినిమాలో పోషిస్తున్నాడని టాలీవుడ్ వర్గాల టాక్. నూతన సంగీత దర్శకుడు సి హెచ్ పవన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని తొలిపాట అయిన ఏయ్ పిల్ల అనే సాంగ్ ప్రివ్యూ ని ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈనెల 14న రిలీజ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. 

 

మంచి రొమాంటిక్ లవ్ సాంగ్ గా ఉండబోతున్న ఈ సాంగ్ కి యువత బాగా కనెక్ట్ అవుతారని అంటోంది సినిమా యూనిట్. అలానే సినిమాలోని మిగతా సాంగ్స్ కూడా అదిరిపోతాయని, దానితో పాటు సినిమా కూడా తప్పకుండా మంచి సక్సెస్ సాధించి చైతన్య, శేఖర్ ల తొలి కాంబినేషన్ హిట్ కావడం ఖాయం అని అంటున్నారు. మరి ఈ ఏడాది వేసవిలో రిలీజ్ కానున్న ఈ సినిమా ద్వారా చైతన్య ఎంత మేర విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఫిదా తరువాత చాలా గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమా కావడంతో ఈ లవ్ స్టోరీ పై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: