కుటుంబ కథలను తెరకెక్కించడంలో నిష్టనాధుడు దర్శకుడు శేఖర్ కమ్ముల.. ఇటీవల శేఖర్ రూపొందించిన ఫిదా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు సాయిపల్లవి, నాగచైతన్యలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పూజ కార్యక్రమాలతో ఇటీవలే సెట్స్ మీదకు వెళ్ళింది. 'లవ్ స్టోరీ'  పేరుతో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

 

 

ఇదిలా ఉంటే సినిమాను నిజామాబాద్ లోషూట్ చేస్తునాడు శేఖర్. గతంలో వచ్చిన ఫిదా సినిమాను కూడా నిజామాబాద్ లో చిత్రీకరంచడంతో మంచి విజయం అందుకుంది ఇప్పుడు ఈ సినిమాను కూడా అక్కడే చిత్రీకరించాలని భావిస్తున్నారట. ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ యాసలో మధ్యతరగతి యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. శరవేగంగా చిత్రీకరణ పూర్తిచేసుకొని ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. 

 

 

 

తెలంగాణ తెలుగు తనం ఉట్టి పడేలా చేసిన  ఫిదా లాంటి బ్యూటీఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కించిన శేఖర్ తాజాగా నాగచైతన్య తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు' లవ్ స్టోరీ' అనే రెగ్యులర్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఏ పిల్ల అనే సాంగ్ ప్రోమోను విడుదల చేసారు చిత్రయూనిట్. ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

 

 

ఇక ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్   “ఏయ్ పిల్లా” ఫుల్ లిరికర్ వీడియోను మార్చి 11న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు.ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా ఇక ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ఫైదలాగా హిట్ అవుతుందా లేక ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: