బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ మన తెలుగు ఇండస్ట్రీకి సాహో ఈ సినిమాతో పరిచయమైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత కూడా ఈ బ్యూటీకి చాలా ఆఫర్లు వచ్చినా కూడా ఆమె బాలీవుడ్లో బిజీగా ఉండడంతో నో చెప్పిందట. ఇక ఈ బ్యూటీ మన తెలుగు ఇండస్ట్రీలో నటించేందుకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీలో పుకార్లు కూడా వస్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఈ బ్యూటీ నటించడానికి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 


ఇక మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ఈ సినిమా విజయంతో మంచి డిమాండ్ ఉంది అనే చెప్పాలి. ఇక మహేష్ 27 వ సినిమాకి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడట. ఈ సినిమాను మైత్రి మూవీస్.. దీనితో పాటు 14 రీల్స్ బ్యానర్ వారు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించాలి అనుకుంటున్నారు. అంతేకాకుండా పరశురాం యూనివర్సల్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం అవుతున్నాడని సమాచారం. ప్రస్తుతం మాత్రం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కొనసాగుతుంది అని సమాచారం. 

 

 

ఇది ఇలా ఉండగా మహేష్ బాబుతో శ్రద్ధాకపూర్ నటిస్తే ఉత్తరాది సినిమాకు మంచి బజ్ ఏర్పడుతుందని.. మహేష్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈమె కాస్త భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు శ్రద్ధా కపూర్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న బాలీవుడ్ బ్యూటీని మహేష్ 27వ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుంది అని మహేష్ బాబు అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారని సమాచారం. ఇక ఫాన్స్ విజ్ఞప్తి పట్టించుకుంటారా లేకపోతే ఈ బ్యూటీ తోనే ముందుకు కొనసాగుతారో లేదో చూడాలి. సినిమాకు సంబంధించి షూటింగ్ జూన్ లేదా ఆగస్టులో మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: