చిరంజీవి కథల విషయంలో పర్టిక్యులర్ గా ఉంటాడు. కమర్షియల్ లెక్కలు, అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా సినిమాలకు సైన్ చేస్తాడు. అయితే ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఈ లెక్కలను పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాడు. ఎక్స్ పెరిమెంట్ కు సిద్ధమవుతున్నాడట చిరు. 

 

చిరంజీవి ఎక్కువగా కమర్షియల్ మీటర్ లోనే సినిమాలు చేస్తాడు. పాటలు, డ్యాన్సులు, ఫైట్ లు, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిసున్న ప్యాకేజ్డ్ స్టోరీస్ తో జనాలముందుకొస్తాడు. రీఎంట్రీ టైమ్ లోనూ ఈ ప్యాకేజ్ తోనే ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కత్తి సినిమాలో కొంచెం కామెడీ, గ్లామర్ మిక్స్ చేసి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు. అయితే ఇప్పుడు మాత్రం అసలు హీరోయిన్ లేకుండా సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. 

 

చిరంజీవి తర్వాత సుజిత్  దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ చేయబోతున్నాడు. మోహన్ లాల్, పృథ్రీరాజ్ కాంబినేషన్ లో రూపొందిన లూసీఫర్ మాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ స్టోరీనే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు చిరంజీవి. మళయాళంలో మోహన్ లాల్ పోషించిన పాత్రను ఇక్కడ చిరంజీవి ప్లే చేయబోతున్నాడు. 

 

లూసీఫర్ సినిమాలో మోహన్ లాల్ క్యారెక్టర్ కు జోడీ ఉండదు. ఎక్కడా హీరోయిన్ ఫోటో కనిపించదు.  పాలిటిక్స్, బ్రదర్ సెంటిమెంట్, ఫుల్ ఆన్ యాక్షన్ ఉంటుంది. దీంతో చిరంజీవికి కూడా ఈ తెలుగు రీమేక్ లో హీరోయిన్ ఉండదు అనే ప్రచారం జరుగుతోంది. మరి చిరు నిజంగానే కమర్షియల్ కోటింగ్ లేకుండానే లూసీఫర్ ని యాజిటీజ గా దింపేస్తున్నాడా.. సుజిత్ మెగా మార్పులు ఏమైనా చేస్తున్నాడా అనేది చూడాలి.

 

మొత్తానికి చిరంజీవి కొత్త ఎక్స్ పెరిమెంట్ రెడీ అయినట్టే తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ మాత్రం లేకుండా సినిమా చేస్తున్నట్టు వినికిడి. మోహన్ లాల్ పాత్రలో చిరు ఏ విధంగా మెస్మరైజ్ చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: