ఈ క్రమంలో మరో ఐదుగురు వాటాదారులను కూడా పరిచయం చేసింది. డెవలప్మెంట్ కోసం స్థలాన్ని రూ.35 కోట్లకు ఇప్పిస్తామని చెప్పి సెక్యూరిటీ డిపాజిట్ గా కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేయమని కోరారు. కార్తీక మాటలు నమ్మిన దొరస్వామి.. ఆమె చెప్పిన అకౌంట్స్ కి కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే అంతలోనే ఆ స్థలానికి, కత్తి కార్తీకకు ఎలాంటి సంబంధం లేదని తెలిసింది.
దీంతో కార్తీక తనను మోసం చేసిందంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆమెపై, ఆమె స్నేహితులపై ఫిర్యాదు చేశాడు. కత్తి కార్తీక బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా పాల్గొంది. 70 రోజులు పాటు సాగిన ఈ షోలో 43వ ఎపిసోడ్లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది కార్తీక. షో లో చాలా చక్కగా చాలా జెన్యూన్ గా ఆడి అప్పుడు మంచి పేరు కూడా తెచ్చుకుంది. కొద్దిరోజుల క్రితం దుబ్బాక ఉప ఎన్నికల సంగ్రామంలో పాల్గొనడానికి తాను సిద్ధమంటూ ప్రకటించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ చీటింగ్ కేసు వల్ల ఈమెకు వున్న పరువు అంత పోయింది. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఇండియా హెరాల్డ్ న్యూస్ చదవండి. ఇంకా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..