రాజమౌళి సినిమా అంటేనే దేశమంతా అదే చర్చ అంతలా తన సినిమాకి హైప్ తీసుకొస్తాడు. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ మూవీ మొదలై ఇంత కాలమైనా ఇంకా విడుదలపై ఎటువంటి క్లారిటీ రాలేదు. పైగా షూటింగ్ కూడా ఇంకా పూర్తికాలేదు. కరోనా కారణంగాప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు ఆటంకం ఏర్పడిన విషయం తెలిసిందే. దీనితో సినీ పరిశ్రమ కూడా తీవ్ర ఆటంకం కలిగింది. కాబట్టి షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం  నిబంధనలతో కూడిన షూటింగులకు అనుమతి ఇవ్వడంతో అన్ని సినిమాలు షూటింగులను ప్రారంభించాయి. రాజమౌళి కూడా ఆర్.ఆర్.ఆర్ మూవీ ని శరవేగంగా షూటింగ్ చేస్తున్నాడు.

అయితే ఈ మూవీ పై ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఉండడంతో ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువ జాగ్రత్త తీసుకుని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో ఈ సినిమాకి సంబంధించిన పాత్రల పరిచయాలకు అమీర్ ఖాన్ వాయిస్ ఇస్తున్నట్లు తెలిసింది. అయితే ఇక్కడ ఇంకో వార్త కూడా తెగ హల్ చల్ చేస్తోంది. అమీర్ ఖాన్ కి రాజమౌళి అంటే ఎంతటి అభిమానమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఇప్పుడు అమీర్ ఖాన్ మరియు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కలయికలో ఒక భారీ యాక్షన్ పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమనేది ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అమీర్ ఖాన్ మహేష్ బాబు లతో సినిమా అంటే ప్రేక్షకులు ఓ రేంజులో ఎంజాయ్ చేస్తారు. ఇద్దరూ యాక్షన్ మూవీ చేయడంలో ఎవరి వారే సాటి. మరి ఈ ఊహ నిజమవ్వాలని అటు బాలీవుడ్ ప్రేక్షకులు ఇటు తెలుగు ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మరి దీనిపై రాజమౌళి కానీ, లేదా అమీర్ ఖాన్ మరియు మహేష్ బాబు లు కానీ స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: