ఇక ఆ తర్వాత మళ్లీ తన పాత స్టయిల్ లో కామెడీ పంచాలని అనుకున్నప్పటికీ కమెడియన్గా కూడా అంతగా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పలు సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు సునీల్. ఇప్పుడు మరో సరికొత్త కాన్సెప్ట్ తో కూడిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఎవరి సహాయం లేకుండా రైతు బతకగలడు అని కానీ మనం బతకాలంటే రైతు కావాలి.. అందుకే రైతు కష్టాన్ని గుర్తించేలా వారి కష్టం గురించి అందరికీ చెప్పేలా జై సేన చిత్రంలో చూపించాము అంటూ సునీల్ చెప్పుకొచ్చాడు.
జై సేన చిత్రంలో కొంచెం తిక్క ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాను అంటూ చెప్పిన సునీల్ ఇలాంటి పాత్ర చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది అంటూ తెలిపాడు. ఈ పాత్ర తన మనసుకు ఎంతో దగ్గర అయింది అంటూ చెప్పుకొచ్చాడు సునీల్. అయితే ప్రస్తుతం సునీల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన జై సేన చిత్రం ఒక మంచి సందేశాత్మకంగా రూపొందిన సినిమా అని దర్శకుడు చెప్పుకొచ్చాడు. వి.సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రీతి శర్మ కథానాయికగా నటించింది. ఈనెల 29వ తేదీన థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.