బిగ్ బాస్.. బుల్లితెర  ప్రేక్షకులందరికీ సరికొత్త ఎంటర్ టైన్మెంట్ పంచుతూ  ఎప్పుడు టాప్ రేటింగ్ సొంతం చేసుకునే కార్యక్రమం. ఒకప్పుడు బాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఈ కార్యక్రమం ఇప్పుడు తెలుగు తెరపైకి కూడా వచ్చేసింది. ఇక ఇటీవలే బిగ్ బాస్ 5వ సీజన్ స్టార్ మా  వేదికగా ప్రసారమైంది. అయితే గత సీజన్ తో పోల్చిచూస్తే ఐదవ సీజన్ కాస్త చప్పగానే ఉంది అని  బుల్లితెర ప్రేక్షకుల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. ఇకపోతే బిగ్బాస్ ఐదవ సీజన్ గ్రాండ్ ఫినాలే సమయంలో మరో రెండు నెలల్లో మీ ముందుకు వస్తాను అంటూ చెప్పారు నాగార్జున. ఇక ఇప్పుడు తన మాట నిలబెట్టుకున్నారు అన్నది అర్ధమవుతుంది. బిగ్ బాస్ ఈసారి టెలివిజన్ వేదికగా కాకుండా ఓటీటీ వేదిక గా ప్రసారం చేసేందుకు సిద్ధమవుతున్నారు.



 అయితే ఇందులో గత బిగ్బాస్ సీజన్ లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్స్ తో పాటు కొత్తవారిని కూడా హౌస్ లోకి పంపించేందుకు సిద్ధమయ్యారు అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్.. అంతే కాదు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లపోతున్నారు అంటూ  ఎంతో మంది పేర్లు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ స్టార్ సింగర్ గీతామాధురి బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా హౌస్ లోకి వెళ్తున్నారు అని అంటున్నారు. అయితే తనకు మాత్రం బిగ్ బాస్ హౌస్ లో ఛాన్స్ వచ్చినా వెళ్ళలేను.. ఎందుకంటే కెరియర్ను ఫ్యామిలీని చూసుకోవాలి కదా అంటూ గీతామాధురి చెప్పుకొచ్చారు.


 ఈ గతంలోనే బిగ్ బాస్ లోకి వెళ్ళిన సమయంలో టైటిల్ మిస్ అయింది.. ఇప్పుడు  వెళ్లిన టైటిల్ కొట్టలేను. ఎందుకంటే నేను సెకండ్ హ్యాండ్ అయిపోతాను కదా. బిగ్ బాస్ హౌస్ లో కేవలం కొత్త టాలెంట్ కు మాత్రమే టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ కి కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చింది ఈ స్టార్ సింగర్. బిగ్బాస్ కెమెరాలు ఎప్పుడూ మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాయి. అందుకే మీలా మీరు ఉండండి. మహా అయితే ఒక వారం నటించగలరు ఏమో.. కానీ ఆ తర్వాత ఆటోమేటిక్ గా మీలా ప్రవర్తించడం మొదలుపెడతారు. ఇక ప్రతి మాట ఆచితూచి మాట్లాడండి.. ఎందుకంటే కాలు జారితే వెనక్కి తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేం అంటూ ఈ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ హౌస్ లోకి వెళ్లి పోయే కంటెస్టెంట్ కి సలహాలు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: