ప్రస్తుతం దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న స్టార్ హీరోయిన్ నయనతార. ఇక నయన్ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ను ఏర్పరచుకుంది


ఈ క్రేజీ హీరోయిన్ అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా దక్షిణాదిలో సరికొత్త రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఇటీవల ఈమె కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఆ జంట ఈనెల జూన్ 9న మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.


మహాబలిపురంలోని ఒక రిసార్ట్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటుగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా హాజరైన సంగతి తెలిసిందే. తమిళ సెలబ్రిటీలు వివాహానికి భారీగా తమిళ సెలబ్రిటీలు హాజరైన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే నయనతార వివాహం అయిన తర్వాత కూడా సినిమాలలో నటించబోతుందట. అయితే కేవలం కొన్ని కండిషన్లకు లోబడి మాత్రమే నయనతార సినిమాలలో నటించడానికి అంగీకరిస్తుందని కోలీవుడ్ సినీ వర్గాలు కూడా చెబుతున్నాయి.


  పెళ్లి తర్వాత నయనతార బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుందట.. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ హీరోగా అట్లీ కుమార్ జవాన్ పేరుతో ఒక మూవీ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసే ప్రాజెక్టు పై అంచనాలు పెంచేశారు. ఈ సినిమాతో నయనతార బాలీవుడ్ బాట పట్టనుంది. ఈ సినిమాలో నయనతార సార్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటించబోతోందట.. ఆ కారణంగానే షారుక్ ఖాన్ నయనతార పెళ్లికి హాజరైనట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో హిందీ, తెలుగు, తమిళ, మల్లయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం నయనతార కూడా భారీగా డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం నయనతార ఏకంగా 8 కోట్ల రూపాయలు పారితోషికం డిమాండ్ చేసిందని తెలుస్తుంది. నయన్ డిమాండ్ మేరకు మూవీ మేకర్స్ కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి కూడా సిద్ధపడినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: