ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని నిర్మాతలకు గడ్డుకాలం నడుస్తుంది. ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడం సినిమాలు కూడా అంతంత మాత్రం గానే ఉండడంతో నిర్మాతలు ఎంతో జాగ్రత్తగా సినిమాలు చేయవలసి ఉంటుంది. దానికి తోడు పెరిగిన ధరలు పెరిగిన రెమ్యునరేషన్ వల్ల వారు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. హీరోలు రెమ్యునరేషన్ ను కోట్లల్లో పెంచుకుంటే, సినిమాలకు పనిచేసే యూనియన్లు సైతం తమ పారితోషకాలను పెంచడం అందరిని ఇబ్బంది పెడుతుంది.

ముఖ్యంగా నిర్మాతలకు ఇది కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్ట్రైక్ నడుస్తున్న విషయం తెలిసిందే. అలాంటి టాలీవుడ్ సినిమా పరిశ్రమను నిర్మాతగా కొన్ని సంవత్సరాలుగా శాసిస్తున్న దిల్ రాజు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడం ఆయనను మరింత ఇబ్బంది పెడుతుంది. ఇటీవలే విడుదల చేసిన థాంక్యూ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించకపోవడం నిజంగా ఆయన కాంపౌండ్ షేక్ చేసే విషయం అనే చెప్పాలి.

అంతకు ముందు ఎఫ్3 సినిమా కూడా ఆయనకు పెద్దగా వర్కౌట్ అవలేదు. ఆయన ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నా డు. ఆ చిత్రాలపైనే ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తమిళ తెలుగు భాషలలో రూపొందుతున్న ద్విభాష చిత్రం వారసుడుపై ఆయన ఆశలు పెట్టుకున్నడని చెప్పాలి. విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరగకుండా జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం 100 కోట్ల పైచిలుకు బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న శంకర్ సినిమాపై కూడా ఆయన ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు.  దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అయ్యి ఆయనను మళ్ళీ కం బ్యాక్ చేసే విధంగా చేస్తుందని అందరూ భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: