తమిళ సినిమాల ద్వారా వెండి తెర కి ఎంట్రీ ఇచ్చిన ముద్దు గుమ్మ త్రిష.  2002 లో మౌనం పెసియాదే చిత్రంలో సూర్య సరసన ఆమె హీరోయిన్ గా నటించింది.అప్పటి నుంచి నేటి వరకు ఆమె హీరోయిన్ గా నటిస్తూనే ఉండటం గమనార్హం.. ప్రతి సారి తన పని అయిపొయింది అనుకున్న టైం లో మళ్లి ఆమె ఎగిసిపడిన అలలా ఉవ్వెత్తున వచ్చి పడేది. 20 ఏళ్ళ పాటు ఒక హీరోయిన్ కి ఇంత కెరీర్ ఉండటం అనేది ఈ రోజుల్లో దాదాపు అసాధ్యమే అని చెప్పాలి.కానీ త్రిష కు మాత్రమే అది సాధ్యం అవ్వడం వెనక ఆమె కృషి మరియు పట్టుదల ఖచ్చితంగా ఉందని తెలుస్తుంది.


ఏజ్డ్ హీరోయిన్ అని అంతకూడా కామెంట్స్ చేస్తూ ఆమె పని అయిపోయింది అనుకున్న టైం లో 96 సినిమా త్రిష కు మళ్లి ఊపిరి పోసిందని చెప్పాలి.. ఆ తర్వాత పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా నటించడం తో ఆమెకు మంచి పాత్ర లభించింది.. వయసేమో 40 కానీ ఇప్పటికి పాతిక ఏళ్ళ హీరోయిన్ లాగ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికి ఆమె చేతిలో ఐదు పెద్ద సినిమాలు కూడా ఉన్నాయ్. హీరో విజయ్ సరసన లియో చిత్రం లో నటిస్తుండగా,ఈ సినిమా 400 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తుంది..

సౌత్ ఇండియాలోనే ఈ రేంజ్ చేసిన సినిమా మరొకటి అయితే లేదు. ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ కానగరాజ్ కాగా సంజయ్ దత్ మరియు అర్జున్ లాంటి దిగ్గజ హీరోలు కూడా కనిపిస్తున్నారు. విక్రమ్ సినిమా తర్వాత లోకేష్ పేరు ఇండస్ట్రీ లో బాగా వినిపిస్తుంది.అలాంటి టైం లో విజయ్ తో లోకేష్ ప్రాజెక్టు ప్రకటించగానే ఇండస్ట్రీ మొత్తం కూడా షేక్ అయ్యింది. ఇక త్రిష విషయానికి వస్తే ఈ సినిమా తో పాటు పొన్నియన్ సెల్వన్ సినిమా సీక్వెల్ లో కూడా త్రిష కనిపించనుండగా, మోహన్ లాల్ సినిమా రామ్ పార్ట్ 1 లో కూడా త్రిష నటిస్తుందని తెలుస్తుంది.. ఇక తానే మెయిన్ లీడ్ గా వస్తున్న మరొక సినిమా ద రోడ్, ఆ తర్వాత సాధురంగా వెట్టై చిత్రంలో కూడా త్రిష నటిస్తుందటా.ఇలా ఏజ్ మీద పడుతున్న కానీ ఎంతో ప్రెస్టీజియస్ సినిమాల్లో ఆమె కనిపించడం ద్వారా త్రిష పని ఇంకా అయిపోలేదు అనే సంకేతాలు కూడా ఇస్తుంది. అయినా హీరోలకు దీటుగా హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీ లో పెద్ద విషయమే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: