
పంజాగుట్ట పరిధిలో ఒక మహిళ జూనియర్ ఆర్టిస్టుగా నివాసం ఉంటోందట. గత నెల 29వ తేదీన ఈమె ఆత్మహత్యకు పాల్పడిందని దీనిపైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది.ఈ కేసులో దర్యాప్తు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తులో పోలీసులు ఆ మహిళ బలవస్మరణానికి గల కారణాలను సైతం తెలుసుకోవడం జరిగిందట.ఆమె ఒక వ్యక్తితో ఉన్న సమయంలో జగదీష్ ఆమెకు తెలియకుండా కొన్ని ఫోటోలు తీసి పంపించారట. ఈ ఫోటోల సహాయంతో ఆమెను బెదిరిస్తున్నారని దీంతో ఆ మహిళ మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని తెలియజేయడం జరిగింది.
దీంతో నటుడు జగదీష్ ను సైతం నిన్నటి రోజున పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉండేటువంటి కోర్టులో హాజరు పరిచారని కాగా ఆ మహిళకు జగదీష్ కు గతంలో పరిచయం ఉన్నట్లుగా పోలీసులు సైతం తెలియజేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఈ న్యూస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా నటుడు జగదీష్ మరి ఈ కేసులో నిర్దోషిగా తేలుతారా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది. పుష్ప సినిమాలో కేశవ పాత్రలో అద్భుతంగా నటించిన ఈ నటుడు ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ సంపాదించారు.