
ఇక నాల్గవరోజుకు చూపు స్పష్టమైంది. అప్పుడు లేచి మూసివున్న తలుపు తెరిచాను. ఆవిడగారు (శ్రీమతి బసవరామతారకంగారు) అచేతనంగా గుమ్మం దగ్గర కూలబడి ఉన్నారు. 'ఏమిటిలా పడుకున్నారు?' అని అడిగాను. అండీ అని సంబోధించడం మా అలవాటు. ''మీరు నిర్దయతో, నిర్దాక్షిణ్యంగా- మాకెవరికీ చెప్పకుండా, నన్నూ మరిచిపోయి మనోవేదనతో- ఒంటరిగా గెడవేసుకుని గదిలో ఉండిపోతే మాకెలా ఉంటుంది?'' అంటూ గుండెపగిలే వేదనతో, దుఃఖంతో అన్నారామె. చలించిపోయాను. ఎక్కడికీ వెళ్ళక. ఏమీ చేయక, ఏమి చేయాలో తోచక, కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా- నా ఆరోగ్యం కోసం అల్లాడిపోయిన ఆమెలో- అర్ధాంగే కాదు... అనురాగం నిండారిన ఓ దేవతామూర్తి కన్పించింది. 'జీవన సహభాగిని' అనే పదానికి అంకితమైన భావంతో కూడిన ఆ పుణ్య స్మృతి- ఆనాటి నుండి నాలో అలాగే నిలచిపోయింది.'' అన్నారు ఎన్టీఆర్.
అర్ధాంగి బసవరామతారకంగారంటే ఎన్టీఆర్ కు అంతటి గౌరవం, ఆరాధనా భావం ఉండేవి. ఎన్టీఆర్ జీవనసాఫల్యానికి చుక్కానిలా నిలిచారు శ్రీమతి బసవరామ తారకమ్మగారు. ఈరోజు ఆ పుణ్యదంపతుల పెళ్ళిరోజు. 1942లో మే 2వ తేదీన కొమరోలు గ్రామంలో వారి వివాహం జరిగింది.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు