టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటీమణులలో కాజల్ అగర్వాల్ ఒకరు . ఈమె ఇప్పటివరకు అనేక తెలుగు సినిమాలలో నటించి ఎన్నో సినిమాలతో అద్భుతమైన విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా చాలా సంవత్సరాల పాటు కెరీర్ను కొనసాగించింది. ఇకపోతే ఈమె కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి వాటిలో కూడా ఎన్నో మూవీ లతో మంచి విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా ఈమె మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈమె కేవలం సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో మాత్రమే కాకుండా జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది.

ఈ సాంగ్లో ఈమె తన అందాలతో మరియు డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో నాగార్జున ఒకరు. నాగార్జున , కాజల్ కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ వీరిద్దరి కాంబోలో రెండు సినిమాలు మిస్ అయినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం నాగార్జున "రగడ" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇందులో అనుష్క , ప్రియమణి హీరోయిన్లుగా నటించగా ... మొదట ఈ మూవీ లో ప్రియమణి పాత్రకు కాజల్ ను అనుకున్నారట.

కానీ కొన్ని కారణాల వల్ల ఆమెను కాకుండా ఆ తర్వాత ప్రియమణి ని తీసుకున్నారట. ఇక నాగార్జున హీరోగా రూపొందిన ది ఘోస్ట్ మూవీ లో మొదట కాజల్ ను హీరోయిన్గా అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరకపోవడంతో ఆ సినిమాలో సోనాల్ చౌహాన్ ను హీరోయిన్గా తీసుకున్నారట. ఇలా రెండు సార్లు నాగార్జున తో నటించే అవకాశాన్ని కాజల్ మిస్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: