
ఇక తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అదేంటంటే – సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక భారీ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా కాన్సెప్ట్ రంగస్థలం తరహాలోనో, లేక పూర్తిగా వేరే కాన్సెప్ట్లోనో ఉండబోతోందో ఇంకా క్లారిటీ రాలేదు కానీ, ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులలో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. మొదట ఈ రోల్ కోసం సమంతను సంప్రదించారట. కానీ ఆమె కొన్ని కారణాల వల్ల ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట. దీంతో ఇప్పుడు ఈ రోల్ కోసం కీర్తి సురేష్, జాన్వి కపూర్ ఇద్దరు హీరోయిన్స్ మధ్య పోటీ నడుస్తోంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ప్రస్తుతం ఈ ఇద్దరిలో ఒకరిని ఫైనలైజ్ చేసే పనిలో మూవీ టీమ్ బిజీగా ఉన్నారట.
అయితే రామ్ చరణ్ మాత్రం జాన్వి కపూర్కి కొంచెం దూరంగా ఉన్నారని సమాచారం. కారణం ఏమిటంటే – ఇప్పటికే ఆయన జాన్వి కపూర్తో "పెద్ది" సినిమాలో స్క్రీన్ షేర్ చేస్తున్నారు. వెంటనే మరో సినిమాలో మళ్లీ ఆమెతో జతకడితే ప్రేక్షకులకు కొత్తదనం తగ్గిపోతుందని భావించినట్లు తెలుస్తోంది. అందుకే రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ కోసం కీర్తి సురేష్ను ఫైనల్ చేయాలని సూచించారట. ఇక కీర్తి సురేష్ లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని, త్వరలోనే సుకుమార్ ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని సినీ ప్రముఖులు అంటున్నారు. మొత్తానికి ఈ కాంపిటీషన్లో ఎవరు విజేత అవుతారన్నది త్వరలోనే బయటపడనుంది..???