ఈ మద్య టాలీవుడ్ లో ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలు వస్తున్నాయి.  ఒకప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ కి మాత్రమే సొంతమైన రికార్డులు ఎస్ ఎస్ రాజమౌళి వచ్చి ఈగ, బాహుబలి సీరీస్ తో ఆ రికార్డులు తిరగరాశారు.  అప్పటి నుంచి టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా వస్తున్నాయి.  స్టార్ హీరోల సినిమాలు మినిమం వంద కోట్లు దాటుతుందంటే అతిశయోక్తి లేదు.  తాజాగా రాంచరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. 


ఈ సినిమాకు టీజర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.  అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక్కో పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు.   ఆ మద్య కన్నడ హీరో కిచ్చ సుదీప్ కి సంబంధించిన ఫోటో రిలీజ్ అయితే..నేడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్  76వ  పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్ర  గోసాయి వెంకన్న పాత్రకు  సంబంధించిన స్టిల్ రిలీజ్ చేశారు.   ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నపాత్రలో అమితాబ్‌ కనిపిస్తాడని పేర్కొంది. పవర్‌ ఫుల్‌ లుక్‌ లో అమితాబ్ కనిపిస్తూ, సినిమాపై అంచనాలను మరింతగా పెంచారు.


కాగా, చిరంజీవి కెరీర్ లో 151వ చిత్రంగా ఈ సినిమాను ఆయన కుమారుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఇక సైరా నరసింహారెడ్డి షూటింగ్   జార్జియాలో జరుగుతున్న విషయం తెలిసిందే.  ఓ యుద్ధ సన్నివేశాలను భారీ బడ్జెట్ తో తెరక్కిస్తున్నారు. సైరా చిత్ర యూనిట్ సెట్ చేసుకున్న షెడ్యూల్స్ లలో ఇదే అతిపెద్ద షెడ్యూల్. వందల మంది సెట్ లో రోజు బిజీ బిజీగా గడుపుతున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలనీ చూస్తున్నాడు. 


ఈ సినిమాలో చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ తదితర భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: