టాలీవుడ్ లో వినూత్న కథనాలు ఎంచుకుంటూ హీరోగా సత్తా చాటుతున్నాడు యువ హీరో శర్వానంద్.  ఎప్పటి కప్పుడు కొత్త కథలతో వస్తూ.. డిఫరెంట్ సినిమాలతో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తాజాగా శర్వానంద్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రణరంగం’ అనే సినిమా చేస్తున్నాడు.  కాజల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  తాాజాగా ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు. 


ఈ టీజర్ "దేవుణ్ణి నమ్మాలంటే భక్తి వుంటే సరిపోతుంది .. కానీ మనుషుల్ని నమ్మాలంటే ధైర్యం కావాలి' అంటూ శర్వానంద్ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ మొదలైంది. ఈ టీజర్ చూస్తుంటే  గతంలో కమల్ హాసన్ నటించిన ‘నాయకుడు’ గతేడాది చివర్లో వచ్చిన ‘KGF’ తరహాలో గ్యాంగ్ స్టర్ నేపథ్యం కథతో వస్తోంది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.   


‘కొందరికి అతను నేరస్థుడు. మిగిలిన వారికి అతను హీరో’ అంటూ 90ల నాటి కాలం కథతో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. చివర్లో ‘కోపాన్ని, దాహాన్ని ఇంకొకడు శాసించే పరిస్థితిలో మనం ఉండకూడదు’ అంటూ శర్వానంద్‌ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.  టీజర్‌లో బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ అదరిపోయింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: